మాజీ ప్రేయసి ఇంటికి బాంబు పార్సిల్ ను పంపిన ప్రియుడు.. ఇద్దరు మృతి
గుజరాత్ రాష్ట్రం వడాలిలో దారుణం జరిగింది. వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు జయంతిభాయ్ బాంబు పార్శిల్ పంపాడు. అది పేలి ఆమె భర్త జీతూభాయ్ తో పాటు వారి కుమార్తె భూమిక చనిపోగా.. మరో ఇద్దరు కుమార్తెలకు గాయాలయ్యాయి. ఆ సమయంలో మహిళ ఇంట్లో లేకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తన ప్రియురాలిని జీతూభాయ్ పెళ్లి చేసుకోవడంతోనే హత్య చేసినట్లు నిందితుడు జయంతిభాయ్ పోలీసుల విచారణలో తెలిపాడు.
గుజరాత్ రాష్ట్రం వడాలిలో దారుణం జరిగింది. వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు జయంతిభాయ్ బాంబు పార్శిల్ పంపాడు. అది పేలి ఆమె భర్త జీతూభాయ్ తో పాటు వారి కుమార్తె భూమిక చనిపోగా.. మరో ఇద్దరు కుమార్తెలకు గాయాలయ్యాయి. ఆ సమయంలో మహిళ ఇంట్లో లేకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తన ప్రియురాలిని జీతూభాయ్ పెళ్లి చేసుకోవడంతోనే హత్య చేసినట్లు నిందితుడు జయంతిభాయ్ పోలీసుల విచారణలో తెలిపాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జయంతిభాయ్ ఆటో రిక్షాలో జీతూభాయ్ ఇంటికి టేప్ రికార్డర్ వంటి పరికరంలో బాంబ్ అమర్చి పార్శిల్ పంపాడు. జీతూభాయ్ దానిని తాజాగా ప్లగ్ ఇన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ బాక్స్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో జీతూభాయ్ అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతని 12 ఏళ్ల కుమార్తె భూమిక ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. జీతూభాయ్ మరో ఇద్దరు కుమార్తెలు కూడా పేలుడులో గాయపడి చికిత్స పొందుతున్నారు. ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహారాష్ట్రలో షాకింగ్ ఘటన.. కమోడ్ లో పాము బుసలు
అందమైన అమ్మాయిల చెమట తో కలిపి స్నాక్స్ తయారీ.. అదరహో అంటున్న కస్టమర్స్
దారుణం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం..
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

