Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబా వంగా జోస్యం.. 2025లో జరగబోయే దారుణాలివేనా

బాబా వంగా జోస్యం.. 2025లో జరగబోయే దారుణాలివేనా

Phani CH

|

Updated on: Jan 01, 2025 | 12:30 PM

రాబోయే కాలంలో ఏం జరగబోతోందో ముందుగానే చూడగలిగే శక్తి ఈ ప్రపంచంలో కొందరికి ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ఫ్రెంచ్‌ ఆస్ట్రాలజర్ నోస్ట్రడామస్ కు సమానంగా భవిష్యవాణి చెప్పడంలో బాబా వంగాకు పేరు పొందింది. బల్గేరియాకు చెందిన ఈమె చిన్నతనంలోనే చూపు కల్పోయినా 85 ఏళ్ల వయసు వరకు క్రియాశీలకంగా ఉండేది. ఆమె జీవితకాంలో చెప్పిన జోస్యాలు చాలావరకు నిజమయ్యాయి.

2025 కి గాను ఆమె చేసిన భవిష్యవాణి గురించి పూర్తిగా తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. 2025లో అంతర్జాతీయ రాజకీయాల పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర ప్రభావం చూపనున్నాయని అంటూ.. దీనికోసం ఆమె మృత్యువు, వినాశనం అనే పదాలు ఉపయోగించారు. 2025లో యుద్ధాలతో భారీ వినాశనం జరుగుతుందని బాబా వంగా జోస్యం చెప్పారు. సిరియా పతనం కాగానే తూర్పు, పశ్చిమ దేశాల మధ్య మహాయుద్ధం మొదలవుతుందనీ.. అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని చెప్పారు. ఈ యుద్ధంలో విజయం సాధించిన వారికే సిరియా చెందుతుంది కానీ విజయం ఒకరిది కాదు సమూహానిది అవుతుంది అని బాబా వంగా చెప్పిన మాటలు రికార్డుల్లో ఉన్నాయి. కళ్ల ముందు సిరియా తాజాగా కూలిపోవడం చూశాం. పైగా రష్యా, ఉక్రెయిన్, యూరోప్ దేశాల కూటమి మధ్య జరుగుతున్న యుద్ధం, ఇజ్రాయెల్ తన పొరుగు దేశాల్లో చేస్తున్న మారణకాండ యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: వైలెంట్‌గా చిరు క్యారెక్టర్దిమ్మతిరిగే అప్డేట్

కారులో డ్రైవర్ కు బిగ్ షాకిచ్చిన బిచ్చగాడు

ఒకే చెట్టుకు మూడు రకాల మందార పూలు

పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే.. తెల్లజుట్టు నల్లగా..

భారతదేశంలో మొట్టమొదటి విడాకుల కేసు ఇదే