Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సముద్రంలో పడిపోయిన ఐఫోన్ ను ఏడు గంటలు కష్టపడి వెదికి తెచ్చిన టీమ్

సముద్రంలో పడిపోయిన ఐఫోన్ ను ఏడు గంటలు కష్టపడి వెదికి తెచ్చిన టీమ్

Phani CH
|

Updated on: Jun 10, 2024 | 5:20 PM

Share

కేరళకు విహారయాత్రకు వచ్చిన ఓ మహిళ ఖరీదైన ఐఫోన్ ను సముద్రంలో పోగొట్టుకుంది.. ఎంత వెదికినా దొరకకపోవడంతో తానుంటున్న హోటల్ మేనేజ్ మెంట్ ను ఆశ్రయించింది. దీంతో ఆ ఫోన్ కోసం ఏకంగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిని హోటల్ మేనేజ్ మెంట్ రంగంలోకి దించింది. ఏడు గంటల పాటు సముద్రంలో గాలించిన ఆ టీమ్.. ఎట్టకేలకు ఫోన్ ను వెతికి బయటకు తీసుకొచ్చింది. ఈ రెస్క్యూ వీడియోను హోటల్ యాజమాన్యం ఇన్ స్టాలో పోస్ట్ చేయగా.. క్షణాలలో వైరల్ గా మారింది.

కేరళకు విహారయాత్రకు వచ్చిన ఓ మహిళ ఖరీదైన ఐఫోన్ ను సముద్రంలో పోగొట్టుకుంది.. ఎంత వెదికినా దొరకకపోవడంతో తానుంటున్న హోటల్ మేనేజ్ మెంట్ ను ఆశ్రయించింది. దీంతో ఆ ఫోన్ కోసం ఏకంగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిని హోటల్ మేనేజ్ మెంట్ రంగంలోకి దించింది. ఏడు గంటల పాటు సముద్రంలో గాలించిన ఆ టీమ్.. ఎట్టకేలకు ఫోన్ ను వెతికి బయటకు తీసుకొచ్చింది. ఈ రెస్క్యూ వీడియోను హోటల్ యాజమాన్యం ఇన్ స్టాలో పోస్ట్ చేయగా.. క్షణాలలో వైరల్ గా మారింది. అయితే, కొంతమంది యూజర్లు మాత్రం ఓ ఫోన్ కోసం పోలీసులు, ఫైర్ సిబ్బంది సేవలు వినియోగించుకోవడంపై విమర్శలు గుప్పించారు. ఇన్సూరెన్స్ క్లెయిం చేసుకుంటే పోయేదానికి గంటల తరబడి అంతమందిని ఇబ్బంది పెట్టడమేంటని అంటున్నారు. కర్ణాటకకు చెందిన ఓ మహిళ కేరళ టూరుకెళ్లింది. ఈ టూర్ లో భాగంగా అంటీలియా షాలెట్స్ అనే రిసార్ట్ లో బస చేసింది. సరదాగా సముద్ర తీరంలోని కొండ రాళ్లపై ఫొటోలు దిగుతుండగా ఫోన్ జారి నీళ్లలో పడిపోయింది. 1.5 లక్షల రూపాయల విలువైన ఐఫోన్ కావడంతో చాలాసేపు వెతికి నిరాశతో హోటల్ కు చేరుకుంది. రిసార్ట్ మేనేజ్మెంట్ కు విషయం చెప్పడంతో.. రిసార్ట్ కు చెందిన స్పెషల్ టీమ్ రంగంలోకి దిగింది. ఫోన్ కోసం తీరంలో గాలించడం మొదలుపెట్టింది. వారికి తోడు కేరళ పోలీసులు, ఫైర్ సిబ్బంది కూడా వచ్చి చేరారు.

రిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కంగన చెంపపై కొట్టిన కానిస్టేబుల్ కు బంగారు ఉంగరం.. ఎవరిస్తున్నారంటే ??

నెట్ ఫ్లిక్స్ పై రూ.1,419 కోట్లకు దావా వేసిన మహిళ

విడాకుల కేసులో ఫొటోలు, వీడియోలు మాత్రమే సాక్ష్యం కావు.. ఢిల్లీ హైకోర్టు

తెలంగాణ, ఏపీ నుంచి కేంద్ర మంత్రులు వీరే

ఆ వ్యాధి సోకిందంటే.. నిద్రలోనే షాపింగ్‌ చేసేస్తారు !! జాగ్రత్త

Published on: Jun 10, 2024 05:08 PM