సర్కారు ఆఫీసుకు దిష్టి.. పోవటానికి ఏం చేసారో తెలుసా
నరదిష్టికి నల్లరాళ్లు బద్దలవుతాయనేది నానుడి. సాధారణంగా కొత్తగా నిర్మించే భవనాలకు, పంటచేలకు దిష్టి తగలకుండా దిష్టి బొమ్మలు పెడతారు. ఇళ్ళకు దిష్టితగలకుండా ఉండేందుకు గుమ్మడికాయలు కడతారు. ఇక ఇంట్లో పసి పిల్లలు ఉంటే వారికి రోజూ సాయంత్రం దిష్టి తీస్తారు. ఇదంతా ఓకే.. అయితే, ఏలూరులో ఓ ప్రభుత్వ కార్యాలయానికి దిష్టి తగిలిందంటూ దిష్టి బొమ్మలు కట్టారు అక్కడి సిబ్బంది.
అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏలూరు ఏజెన్సీ కుక్కునూరులోని ఫారెస్ట్ ఆఫీస్ రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గేటుకి దృష్టి తగలకుండా బ్యానర్స్ కట్టారు. అందులో ఒకవైపు రాక్షసుడు , మరోవైపు కళ్ళ దిష్టి వినాయకుడి బొమ్మలు కనిపిస్తున్నాయి. ఇలా ప్రభుత్వ కార్యాలయానికి ఇలాంటి దిష్టి తొలగించే బొమ్మలు అంటించటం పట్ల, స్థానికులతో పాటు, అటుగా వెళ్లే వారంతా దీనిపై చర్చించుకుంటున్నారు. ‘ఎవరి నమ్మకాలు వారివే గానీ.. మరీ ఇలా గవర్నమెంట్ ఆఫీసులకు కూడా ఇలాంటివి కట్టడం మూఢనమ్మకాలను ప్రోత్సహించటమే’ అంటూ కొందరు యువకులు ఆరోపిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
త్వరలో లక్కీ భాస్కర్2.. సీక్వెల్ పై హింట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
ఇదెక్కడి వాతావరణం.. ఇక్కడేమో ఎండలు.. అక్కడేమో వర్షాలు
రైల్వే ట్రాక్ను కమ్మేసిన పొగ..నిలిచిపోయిన రైలు
ఆ దేశంలో ఆఫీసులు .. స్వర్గానికి స్పాట్లు
వీళ్లు మనుషులేనా.. పెళ్లిలోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు కదా!
గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. ముప్పు తప్పదా?
ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఆ సీక్రెట్ ఫైల్స్లో ఏముంది?
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు

