Viral video: మరుగుదొడ్డి కోసం గుంత తవ్వుతున్న వ్యక్తి.. 2 మీటర్లు తవ్వగా కళ్లు జిగేల్… వైరల్ అవుతున్న వీడియో..
ఓ వ్యక్తి మరుగుదొడ్డి నిర్మాణం కోసం తన కుమారుడితో కలిసి గుంతలు తవ్వుతున్నాడు. ఈ క్రమంలో రెండు మీటర్ల లోతువరకు తవ్వేసరికి ఏదో మెరుస్తూ కనిపించింది...
ఓ వ్యక్తి మరుగుదొడ్డి నిర్మాణం కోసం తన కుమారుడితో కలిసి గుంతలు తవ్వుతున్నాడు. ఈ క్రమంలో రెండు మీటర్ల లోతువరకు తవ్వేసరికి ఏదో మెరుస్తూ కనిపించింది. జాగ్రత్తగా దానిని పైకి తీసి చూసిన అతని కళ్లు జిగేల్ మన్నాయి. ఈక్రమంలో తవ్వడం కొనసాగించిన అతను ఆశ్చర్యపోయాడు. అసలేం జరిగిందంటే…
కంబోడియా ప్రావిన్స్ వాయువ్య ప్రాంతంలోని కోర్క్వాట్ గ్రామానికి చెందిన బోయిన్ రాన్ అనే వ్యక్తి తన కుమారుడితో కలిసి మరగుదొడ్డి కట్టేందుకు గుంతలు తవ్వుతున్నాడు. ఈ క్రమంలో అతనికి ఒక నీలిరంగు రాయి కనిపించింది. దానిని తీసి శుభ్రపరిచి చూడగా అదొక పురాతన కాంస్య విగ్రహంగా గుర్తించారు. అలా ఇంకొంచం తవ్వగా మరో నాలుగు విగ్రహాలు బయటపడ్డాయి. వాటిని తన ఇంట్లోనే ఉంచాలని నిర్ణయించుకుని శాంతిని కోరుతూ వాటి ముందు ధూపం వెలిగించాడు. అయితే ఈ వార్త దావానంలా వ్యాపించింది. ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అతని ఇంటికి చేరకున్న పోలీసులు ఆ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తమ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత, విగ్రహాలను ప్రావిన్షియల్ మ్యూజియంలో ఉంచుతామని తెలిపారు. ఈ పురాతన విగ్రహాలు 10 లేదా 11వ శతాబ్దానికి చెందిన థోబ్ బాఫున్ శైలిలో ఉన్నాయని ఒక పురావస్తు శాస్త్రవేత్త తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
గ్యాస్ సెగ.. మళ్లీ లాక్డౌన్ తప్పదా
విమానంలో బీడీ తాగాడు.. కట్ చేస్తే.. ఇలా అయ్యాడు
చిలుక జోస్యం చెప్పే వ్యక్తి చేతిలో.. లక్షలు పోగొట్టుకున్న అధికారి
ఈమె అవతారం చూసి పిచ్చిది అనుకుంటున్నారా ?? కాదు గొప్ప సెలబ్రిటీ
చితి పెడదాం అని తీసుకెళ్లారు.. ఈ లోపే తిరిగి లేచాడు
కోతులకు భయం.. భక్తులకు అభయం !! హనుమంతుడి రూపంలో ఆశీస్సులు
ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ

