అమిత్ షా తాగే నీళ్ల ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు !!
గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాగిన నీళ్ల బాటిల్ ధరపై సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తున్నారు నెటిజన్స్.
గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాగిన నీళ్ల బాటిల్ ధరపై సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తున్నారు నెటిజన్స్. అయితే క్రమంలో గోవా రాష్ట్ర మంత్రి రవి నాయక్ కుండ బద్దలయ్యేలా… ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఆ బాటిల్ ధరను వెల్లడించి, నెటిజన్స్కు షాక్ ఇచ్చాడు. అమిత్ షా తాగే వాటర్ బాటిల్ ధర.. అక్షరాల 850రూపాయలని అన్నాడు మంత్రి రవి నాయక్. గోవాలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. రాబోయే రోజుల్లో నీళ్ల ధర ఆకాశానికి పెరుగుతుందని చెప్తూ.. అమిత్ షా తాగిన నీళ్ల బాటిల్ ధరను వెల్లడించారు. ప్రచారం కోసం వచ్చినప్పుడు హిమాలయ బ్రాండ్ నీళ్లు కావాలని షా అడిగారని, పనాజీ నుంచి 10 కిలోమీటర్ల దూరం నుంచి ఆ నీళ్ల బాటిళ్లను తెప్పించామని అన్నాడు. ప్రస్తుతం స్టార్ హోటళ్లలోనూ ఒక్కో నీళ్ల బాటిల్ ధర 150 నుండి 160 రూపాయల వరకు ఉందని వెల్లడించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యజమానిపై వ్యక్తి దాడి !! దూరం నుంచి చూసిన ఆవు ఏం చేసిందో చూడండి !!
Platform 65: హైదరాబాద్లో వింత రెస్టారెంట్ !! రైళ్లే అక్కడ సర్వర్లు !!
‘బట్టతల’ అన్నారంటే తప్పదు భారీ మూల్యం.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు !!
ఆకట్టుకుంటున్న రంగు రంగుల పూరీలు.. రాగి ఇడ్లీలు.. ఎక్కడో తెలుసా ??
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస
మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరి ఆగిపోయిన ఘటన
జమ్ముకశ్మీర్ లో తులిప్ గార్డెన్ కు పర్యాటకుల తాకిడి
12 నిమిషాల్లో.. కేజీ బంగారాన్ని కొట్టేశారు
చేపల కోసం వల వేస్తే చిక్కింది చూసి జాలరి షాక్

