Woman Attack: యువకుడి మర్మాంగంపై దాడి.. అసలు నిజాలు బయటపెట్టిన మహిళ..!
సంచలనం సృష్టించిన బ్లేడుతో మర్మాంగం కోసిన మహిళ ఘటనలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకలో జరిగిన సంఘటనపై మీడియాలో
సంచలనం సృష్టించిన బ్లేడుతో మర్మాంగం కోసిన మహిళ ఘటనలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకలో జరిగిన సంఘటనపై మీడియాలో అనేక కథనాలు వెల్లువడ్డాయి. ఉద్దేశపూర్వకంగా మహిళ కావాలనే అతని మర్మాంగంపై దాడి చేసిందని, ప్రియుడిని ఇంటికి పిలిచి కావాలనే ప్రియురాలు ఇలా చేసిందనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై తాజాగా సదరు మహిళ స్పందించి అసలు నిజాలు బయటపెట్టింది. తనపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమనన్నారు.. సమాజం అవమానకరంగా చూస్తోందని.. ఆత్మహత్యే శరణ్యం అంటూ ఆ మహిళ బోరున ఏడ్చారు. దాడి ఘటన రోజు రాత్రి బంధువైన కృష్ణ గణేష్ అనే వ్యక్తి తమ ఇంటికి వచ్చాడని మహిళ తెలిపింది. తన భర్త ఇంట్లో లేడని తెలుసుకుని వచ్చి కొన్ని మంచి నీళ్లు తీసుకురమ్మన్నాడు. ఇక నీళ్లు తాగిన తర్వాత ఆ వ్యక్తి అత్యాచారం చేయబోయాడు. అదే సమయంలో ఏం చేయాలో తోచలేదని.. ఆత్మ రక్షణలో భాగంగా ఇంట్లో ఉన్న బ్లేడు తీసుకుని అతడిపై విసిరేశానని తెలిపింది. అనంతరం అతడికి ఎక్కడ గాయం అయిందో కూడా తనకు తెలియదన్నారు. ఈ ఘటనలో అనవసరంగా తనపై ప్రియుడు, ప్రియురాలు అని అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇలా చేస్తే నాకు ఆత్మహత్యే దిక్కంటూ ఆమె తెలిపారు. ఏ మహిళకు ఇలాంటి పరిస్థితి రాకూడదని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు ఘటనకు సంబంధించి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

