గర్భస్థ శిశువు కడుపులో ఉన్నది చూసి షాక్‌ .. వైద్యులకే మతి పోగొట్టిన కేసు ఇది

గర్భస్థ శిశువు కడుపులో ఉన్నది చూసి షాక్‌ .. వైద్యులకే మతి పోగొట్టిన కేసు ఇది

Samatha J

|

Updated on: Feb 02, 2025 | 10:50 AM

ఓ అమ్మాయి తల్లి కాబోతుందని తెలిసినప్పటి నుంచి ఆమె వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స పొందడం చాలా సహజం. అయితే పరీక్షించిన వైద్యులే ఆమె కడుపులో ఎంత మంది పిల్లలు ఉన్నారు, వారి ఆరోగ్యం ఎలా ఉందో చెబుతుంటారు. అయితే ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఒక్కోసారి అయితే ఐదుగురు పిల్లలు కూడా ఓ తల్లి కడుపులో పెరుగుతుంటారు.

ఇలాంటి వార్తలు చాలా సార్లే చూసుంటారు. ఆ తరువాత ఆ బిడ్డలకు జన్మనివ్వడం.. వారంతా ఆరోగ్యంగా ఉండడం కూడా చూసుంటారు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే స్టోరీలో ఇంతకుముందెప్పుడూ చూడని ట్విస్ట్ ఉంది.బుల్దానా జిల్లాకు చెందిన 32 ఏళ్ల మహిళ కొన్ని నెలల క్రితమే గర్భం దాల్చింది. ఇక అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటూ ప్రతీ నెలా వైద్యుల వద్దకు వెళ్తోంది. తన కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే ఎప్పటిలాగే ప్రభుత్వ ఆస్పత్రిలో చెకప్ కోసం వెళ్లిన ఈ మహిళకు అక్కడి వైద్యులు ఓ షాకింగ్ వార్త చెప్పారు. ముఖ్యంగా ఆమె కడుపులో ఉన్న బిడ్డ కడుపులో మరో పిండం ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ సహా ఆమె కుటుంబ సభ్యులు అంతా తీవ్ర షాకయ్యారు.

మరిన్ని వార్తల కోసం :

బిగ్ వార్నింగ్‌! అందం కోసం అవి వాడుతున్నారా? అసలుకే మోసం జాగ్రత్త!

మరో భార్యాబాధితుడి ఆత్మ*హ*త్య.. ఎక్కడంటే? వీడియో

పౌరసత్వం వారికే సొంతం..అందరికీ కాదు! 

తిరుమల భక్తులకు అలర్ట్‌.. కొండపై మళ్లీ చిరుత సంచారం..!

దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్‌ ద్వారా ప్రభుత్వ సేవలు !