Rajasthan: 17 మంది మనవళ్లు, మనుమరాళ్లకు ఒకేసారి పెళ్లి.! తాత ప్లాన్ అదుర్స్.
లాల్మదేసర్ గ్రామంలో గ్రామ పెద్దగా సూర్జారామ్ గోదారా ఉన్నారు. సూర్జారామ్ వారసులంతా ఉమ్మడి కుటుంబంగా నివసిస్తున్నారు. అయితే ఆ కుటుంబంలో పెళ్లికి ఎదిగిన సూర్జారామ్ మనుమళ్లు, మనుమరాళ్లు 17మంది ఉన్నారు. వీరందరికీ విడివిడిగా వివాహం జరిపించడం ఖర్చుతో కూడుకున్న పని అనుకున్నారో ఏమో కానీ, అందరికీ ఒకేసారి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు.
రాజస్థాన్ బీకానేర్ జిల్లాలో ఓ వృద్ధుడు తన 17 మంది మనుమరాళ్ల, మనుమళ్ల పెళ్లి ఒకేసారి చేశారు. ఒక్క రోజు గ్యాప్లో వారి సామూహిక వివాహం జరిపించారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా జరిగింది ఇదే. లాల్మదేసర్ గ్రామంలో గ్రామ పెద్దగా సూర్జారామ్ గోదారా ఉన్నారు. సూర్జారామ్ వారసులంతా ఉమ్మడి కుటుంబంగా నివసిస్తున్నారు. అయితే ఆ కుటుంబంలో పెళ్లికి ఎదిగిన సూర్జారామ్ మనుమళ్లు, మనుమరాళ్లు 17మంది ఉన్నారు. వీరందరికీ విడివిడిగా వివాహం జరిపించడం ఖర్చుతో కూడుకున్న పని అనుకున్నారో ఏమో కానీ, అందరికీ ఒకేసారి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. అనుకున్నట్లుగానే పక్కా ప్లాన్ వేసుకుని వారందరి పెళ్లిళ్లకు ఒకే ఆహ్వాన పత్రికను సిద్ధం చేశారు. అనంతరం బంధువులను పిలిచి ఐదుగురు మనుమళ్లకు సోమవారం ఏప్రిల్ 1వ తేదీన పెళ్లి చేశారు. మరుసటి రోజు 12మంది మనుమరాళ్లకు వివాహం జరిపించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇలా ఒకే ఇంట్లో సామూహిక వివాహాలు జరగడం ఈ ప్రాంతంలో ఇదే మొదటి సారి అని స్థానికులు మీడియాకు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
ఆ ఊర్లోకి ఐస్క్రీం బండి వెళ్లాలంటే హడల్
భారీగా పెరిగిన జొమాటో ప్లాట్ఫామ్ ఫీజు
గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్ యాన్ ఐడియా
బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..

