బస్సులో ఎక్కిన ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు.. డ్రైవర్‌ ఏం చేశాడో తెలుసా ??

అధికారులు, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎంత నిఘా పెట్టినా అక్రమార్కులు తమ పంథాను మార్చుకోవడంలేదు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పోలీసులు, అధికారుల కళ్లు గప్పి మత్తుపదార్ధాలు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. తాజాగా ఇద్దరు వ్యక్తులు సామాన్య ప్రయాణికుల్లా బస్సు ఎక్కారు. ఎందుకో వారిని చూడగానే అనుమానం కలిగిన బస్సు డ్రైవర్‌.. బస్సును నేరుగా పోలీస్‌ స్టేషన్‌కి పోనిచ్చాడు.

బస్సులో ఎక్కిన ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు.. డ్రైవర్‌ ఏం చేశాడో తెలుసా ??

|

Updated on: Jun 13, 2024 | 10:46 AM

అధికారులు, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎంత నిఘా పెట్టినా అక్రమార్కులు తమ పంథాను మార్చుకోవడంలేదు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పోలీసులు, అధికారుల కళ్లు గప్పి మత్తుపదార్ధాలు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. తాజాగా ఇద్దరు వ్యక్తులు సామాన్య ప్రయాణికుల్లా బస్సు ఎక్కారు. ఎందుకో వారిని చూడగానే అనుమానం కలిగిన బస్సు డ్రైవర్‌.. బస్సును నేరుగా పోలీస్‌ స్టేషన్‌కి పోనిచ్చాడు. సీన్‌ అర్ధమైన స్మగ్లర్లు బస్సులోంచి దూకేసారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదమానాపురంలో ఆర్ టీ సి బస్సులో గంజాయి కలకలం రేపింది. ప్రయాణికుల ముసుగులో గంజాయితో బస్సెక్కిన ఇద్దరు స్మగ్లర్లను బస్సు డ్రైవర్‌ గుర్తించాడు. వారికి ఎలాంటి అనుమానం రాకుండా చాకచక్యంగా బస్సును పోలీస్ స్టేషన్ కి మళ్లించాడు. పోలీస్ స్టేషన్ వద్దకు బస్సు రాగానే నేరగాళ్లు బస్సులో నుండి దూకే ప్రయత్నం చేశారు. వారిని బస్సు డ్రైవర్‌, ఇతరులు పట్టుకోడానికి ప్రయత్నించారు. అయితే వారిద్దరూ తప్పించుకొని పారిపోయారు. స్మగ్లర్లు బ్యాగుల్లో తరలిస్తున్న 14 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నాకు. పారిపోయినవారి కోసం గాలింపు చేపట్టారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంతరిక్ష కేంద్రంలో ‘సూపర్ బగ్’.. చిక్కుల్లో సునీతా విలియమ్స్

పేటీఎంలో ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు.. ఎంత మందికి ఉద్వాసన పలికిందంటే ??

TOP 9 ET News: ‘నా తమ్ముడు డిప్యూటీ సీఎం’ చిరు ట్వీట్ | క్లీంకార పుట్టిన వేళావిశేషం మెగా కుటుంబానికి పట్టిన అదృష్టం

రిలీజ్‌ అయిన 20 రోజుల్లోనే OTTలోకి విశ్వక్.. GOG వైపే అందరి చూపు

అంచనాలు తలకిందులు చేస్తూ.. OTTలోకి కార్తికేయ సినిమా

Follow us