పేటీఎంలో ఉద్యోగులకు పింక్ స్లిప్లు.. ఎంత మందికి ఉద్వాసన పలికిందంటే ??
లేఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే పలు టెక్ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను సాగనంపింది. తాజాగా ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ పేటీఎం మాతృసంస్థ వన్-97 కమ్యూనికేషన్స్ తన ఉద్యోగులకు పింక్ స్లిప్స్ పంపిణీ చేసింది. ఎంత మంది ఉద్యోగులను సాగనంపిందన్న సంగతి తెలియరాలేదు.కానీ, ఉద్యోగులను తొలగించినట్లు పేటీఎం ధృవీకరించింది. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇతర సంస్థల్లో ఉపాధి కల్పనకు సాయపడుతున్నామని పేటీఎం చెబుతున్నట్లు పీటీఐ ఓ వార్తా కథనం ప్రచురించింది.
లేఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే పలు టెక్ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను సాగనంపింది. తాజాగా ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ పేటీఎం మాతృసంస్థ వన్-97 కమ్యూనికేషన్స్ తన ఉద్యోగులకు పింక్ స్లిప్స్ పంపిణీ చేసింది. ఎంత మంది ఉద్యోగులను సాగనంపిందన్న సంగతి తెలియరాలేదు.కానీ, ఉద్యోగులను తొలగించినట్లు పేటీఎం ధృవీకరించింది. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇతర సంస్థల్లో ఉపాధి కల్పనకు సాయపడుతున్నామని పేటీఎం చెబుతున్నట్లు పీటీఐ ఓ వార్తా కథనం ప్రచురించింది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాజీనామా చేసిన ఉద్యోగులకు కొత్త ఉద్యోగాల కల్పనకు 30 సంస్థలతో కలిసి తమ హెచ్ఆర్ విభాగం పని చేస్తున్నదని పేటీఎం వెల్లడించింది. ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్న నేపథ్యంలో ఉద్యోగులందరికీ బోనస్ కూడా విడుదల చేసింది. ఉద్యోగుల తొలగింపు విషయమై తాము అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు పేటీఎం తెలిపింది. సంస్థ సేల్స్ డివిజన్లో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్యలో 3500 మంది తగ్గారు. మార్చి నెలాఖరు నాటికి పేటీఎంలో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 36,521 మంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సర్వీసులపై ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి పేటీఎం నష్టాలు పెరిగాయని తెలుస్తోంది. నియంత్రణాపరమైన నిబంధనలు పాటించడం లేదని తమ తనిఖీలో తేలడంతో మార్చి 15 తర్వాత కొత్తగా ఖాతాలు ప్రారంభించొద్దని, వాలెట్లు, ఫాస్టాగ్ చెల్లింపులు జరపవద్దని కస్టమర్లను ఆర్బీఐ ఆదేశించింది. ఆర్బీఐ నిషేధం తర్వాత 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో పేటీఎం నష్టాలు రూ.550 కోట్లకు పెరిగాయి. అంతకుముందు ఏడాది 2022-23 నాలుగో త్రైమాసికంలో రూ.167.5 కోట్ల నష్టాలు మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రిలీజ్ అయిన 20 రోజుల్లోనే OTTలోకి విశ్వక్.. GOG వైపే అందరి చూపు
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్ను చంపేసిన వ్యక్తి
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్

