Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌కు అరుదైన గౌరవం

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌కు అరుదైన గౌరవం

Phani CH

|

Updated on: Oct 09, 2023 | 8:24 PM

ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా ప్రకాశం బ్యారెజ్‌కు అరుదైన గౌరవం దక్కింది. దేశ వ్యాప్తంగా ఎంపికైన నాలుగు కట్టడాల్లో ప్రకాశం బ్యారేజ్ కూడ స్థానం దక్కించుకుంది. విజయవాడ వద్ద కృష్ణా నదిపై గల ప్రకాశం బ్యారేజికి ఇంటర్నేషనల్ కమీషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజికి సంబంధించిన వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అవార్డుకు ఎంపికైంది. వ్యవసాయంలో సమర్ధవంతంగా నీటిని వినియోగించే హెరిటేజ్ స్ట్రక్చర్లను గుర్తించేందుకు ఈరంగంలో పరిశోధనలు జరిపే పరిశోధకులను ప్రోత్సహించే లక్ష్యంతో ఐసిఐడి ఈ అవార్డులను ఇస్తుంది.

ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా ప్రకాశం బ్యారెజ్‌కు అరుదైన గౌరవం దక్కింది. దేశ వ్యాప్తంగా ఎంపికైన నాలుగు కట్టడాల్లో ప్రకాశం బ్యారేజ్ కూడ స్థానం దక్కించుకుంది. విజయవాడ వద్ద కృష్ణా నదిపై గల ప్రకాశం బ్యారేజికి ఇంటర్నేషనల్ కమీషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజికి సంబంధించిన వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అవార్డుకు ఎంపికైంది. వ్యవసాయంలో సమర్ధవంతంగా నీటిని వినియోగించే హెరిటేజ్ స్ట్రక్చర్లను గుర్తించేందుకు ఈరంగంలో పరిశోధనలు జరిపే పరిశోధకులను ప్రోత్సహించే లక్ష్యంతో ఐసిఐడి ఈ అవార్డులను ఇస్తుంది. వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ 2023 అవార్డులకు ఐసిఐడి, ఐఎన్సిడిల తరపున నామినేషన్లు కోరగా వచ్చిన నామినేషన్లలో 19 నిర్మాణాలను ఈ అవార్డులకు ప్యానల్ జడ్జెస్ సిఫార్సు చేసి ఎంపిక చేయగా వాటిలో భారతదేశం నుండి 4 నిర్మాణాలను ఈ వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ 2023 అవార్డుకు ఎంపిక చేసింది. వాటిలో కృష్ణా నదిపై గల ప్రకాశం బ్యారేజితో పాటు ఒడిస్సా లోని బలిదిహాప్రాజెక్టు, జయమంగళ ఆనకట్టలు, తమిళనాడులోని శ్రీవాయికుంటం ఆనకట్ట ఈ అవార్డుకు ఎంపిక అయ్యాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్‌ న్యూస్‌.. చీరమేను చేప వచ్చిందోచ్.. కేజీ ఎంతంటే ??

ముఖ్యమంత్రి సారూ.. మాకు రూ.2 వేలు రాలేదు అంటూ నిలదీసిన మహిళలు

20 నిమిషాల్లో 5వేల రాకెట్ల వెనుక అసలు కథ ఇది

దేశం కాని దేశంలో ఏం జరిగిందో తెలీదు !! ఇంట్లోనే విగతజీవులుగా కనిపించారు

లాకప్‌లో ఉంచినందుకు రూ.50 వేల పరిహారం.. పోలీసులే చెల్లించాలని ఢిల్లీ కోర్టు ఆదేశం