TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త..
ఉద్యోగుల సంక్షేమం కోసం టీఎస్ఆర్టీసీ మరో అడుగు వేసింది. ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపుపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక ఒప్పందం చేసుకుంది. దీంతో ప్రమాద బీమా రూ.40 లక్షల నుంచి రూ. ఒక కోటికి పెరిగింది. హైదరాబాద్ లోని బస్ భవన్లో శనివారం ప్రమాద బీమా పెంపుపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, యూబీఐ సీజీఎం అండ్ జోనల్ హెడ్ భాస్కర్ రావులు ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు.
ఉద్యోగుల సంక్షేమం కోసం టీఎస్ఆర్టీసీ మరో అడుగు వేసింది. ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపుపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక ఒప్పందం చేసుకుంది. దీంతో ప్రమాద బీమా రూ.40 లక్షల నుంచి రూ. ఒక కోటికి పెరిగింది. హైదరాబాద్ లోని బస్ భవన్లో శనివారం ప్రమాద బీమా పెంపుపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, యూబీఐ సీజీఎం అండ్ జోనల్ హెడ్ భాస్కర్ రావులు ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఆర్టీసీ ఉద్యోగులు అకాల మరణం చెందినా, శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బందికి ఈ ప్రమాద బీమా వర్తించనుంది. యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ కింద రూ.కోటి ప్రమాద బీమాను అందించనున్నారు. అలాగే రూపే కార్డు ద్వారా మరో రూ.12 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. అయితే ఇందు కోసం ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే మొత్తంగా రూ.1.12 కోట్ల వరకు ప్రమాద బీమాను యూబీఐ సహకారంతో బాధిత కుటుంబాలకు ఆర్టీసీ సంస్థ అందించనుంది. పెరిగిన ప్రమాద భీమా ఫిబ్రవరి 1 వ తేది నుంచి అమల్లోకి రానుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయోధ్యకు ప్రపంచంలోనే ఖరీదైన రామాయణం !! దాని విలువ ఎంతంటే ??
గోరంత సైజులో బంగారు అయోధ్య రామ మందిరం.. స్వర్ణకారుడి అద్భుత సృష్టి
తడబడి పడబోయిన సీఎం స్టాలిన్.. చేయందించిన పీఎం మోదీ
ముగిసిన సానియా మీర్జా, షోయబ్ మాలిక్ ల దాంపత్య జీవితం
షమీ రెండో పెళ్లి చేసుకుంటున్నాడా ?? సోషల్ మీడియాను కుదిపేస్తున్న పిక్
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస

