పెరగనున్న టోల్ ఛార్జీలు.. వాహనదారుల జేబుకు చిల్లు
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై మళ్లీ టోల్ ఛార్జీలు పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పెరిగే టోల్ ఛార్జీలు పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా పడ్డాయి. పెరిగిన టోల్ ఛార్జీలు జూన్ ఒకటో తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి విషయంలో బిఓటి పద్ధతిలో విస్తరణ పనులకు అయిన వ్యయాన్ని రాబట్టుకునేందుకు జిఎంఆర్ సంస్థ సిద్దమైంది.
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై మళ్లీ టోల్ ఛార్జీలు పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పెరిగే టోల్ ఛార్జీలు పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా పడ్డాయి. పెరిగిన టోల్ ఛార్జీలు జూన్ ఒకటో తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి విషయంలో బిఓటి పద్ధతిలో విస్తరణ పనులకు అయిన వ్యయాన్ని రాబట్టుకునేందుకు జిఎంఆర్ సంస్థ సిద్దమైంది. జాతీయ రహదారిపై ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వద్ద ఒకొక్కటి చొప్పున మూడు టోల్ప్లాజాలను జీఎమ్మార్ సంస్థ ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 2012 నుంచి టోల్ఫీజు వసూళ్లను కాంట్రాక్టు సంస్థ ప్రారంభించింది. నేషనల్ హైవే అథారిటీ నిబంధనల మేరకు ప్రతిఏటా ఏప్రిల్ ఒకటో తేదీన టోల్ఫీజు ధరలను పెంచుకునే వెసులుబాటు జీఎమ్మార్ సంస్థకు ఎన్హెచ్ఏఐ కల్పించింది. అయితే ఈసారి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో టోల్ చార్జీల పెంపును ఎన్నికల సంఘం వాయిదా వేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా.. చివరి విడత జూన్ 1న ముగియనుంది. ఆ రోజు అర్ధరాత్రి నుంచి పెరిగిన టోల్ ధరలు అమల్లోకి వస్తాయి. యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద పెరిగిన టోల్ చార్జీలను పరిశీలిస్తే… కార్లు, జీపులు, వ్యాన్లకు రెండు వైపుల ప్రయాణానికి 5 రూపాయిలు, చిన్న లారీ 10 టైర్స్ వాహనంపై 10 రూపాయలు పెరిగాయి. వాణిజ్య వాహనాలతో పాటు భారీ గూడ్స్ లారీలకు 15 రూపాయలు పెరిగింది. మొత్తం ఐదు శాతం మేర టోల్ ఛార్జీలు పెంచినట్టు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఊరి చివర గేదెలు మేపేందుకు వెళ్లారు.. అక్కడ కనిపించింది చూసి షాక్
బీట్రూట్తో ఇలా చేయండి.. మెరిసే చర్మం మీ సొంతం
భర్త ఇచ్చిన గిఫ్ట్తో కోటీశ్వరురాలైన భార్య.. ఎలాగంటే ??
కుటుంబంలో 10 మందిని కోల్పోయి.. ఒంటరివాడినయ్యా !! అసలు కథ ఏంటంటే ??
ఇల్లు, డబ్బు తీసుకుని తల్లిని గెంటేసిన కూతురు.. ఆ తర్వాత ఏం జరిగింది ??
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు

