Tirumala: తిరుమల శ్రీవారికి భక్తురాలు కోటి విరాళం..
చెన్నై భక్తురాలు సౌమ్య టీటీడీ ట్రస్టులకు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. అన్నప్రసాదం, ప్రాణదానం ట్రస్టులకు సమానంగా చెక్కు అందజేశారు. అలాగే, చెన్నైకి చెందిన లోటస్ ఆటో వర్డ్ భక్తులు శ్రీవారి సేవకు రూ.10 లక్షల విలువైన రెండు ఎలక్ట్రిక్ కార్లను విరాళంగా సమర్పించారు. భక్తుల ఉదారతకు టీటీడీ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.
వడ్డీకాసులవాడికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ట్రస్టులకు ఓ భక్తురాలు భారీ విరాళం అందజేశారు. చెన్నైలోని ఈరోడ్కు చెందిన సౌమ్య అనే భక్తురాలు ఏకంగా రూ. కోటి రూపాయలు విరాళంగా అందజేసి తన భక్తిని చాటుకున్నారు. ఈ మేరకు ఆమె విరాళానికి సంబంధించిన చెక్కును టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ విరాళాన్ని రెండు కీలకమైన ట్రస్టులకు సమానంగా విభజించి ఇచ్చారు. శ్రీవారి నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు రూ.50 లక్షలు, ప్రాణదానం ట్రస్టుకు మరో రూ.50 లక్షల చొప్పున విరాళంగా అందించారు. భక్తురాలి ఉదారతకు టీటీడీ తరఫున అదనపు ఈవో వెంకయ్య చౌదరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దాత సౌమ్యను శాలువాతో సత్కరించారు. అనంతరం ఆమెకు స్వామివారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి సేవలకు భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించడం అభినందనీయమని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. అలాగే తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన భక్తులే రెండు కార్లను రెండు కార్లను డొనేట్ చేశారు. చెన్నై కి చెందిన లోటస్ ఆటో వర్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన భక్తులు రూ. 10 లక్షల విలువైన ఎలక్ట్రిక్ కార్లను టిటిడి అధికారులకు అందజేశారు. అనంతరం కార్లు డొనేట్ చేసిన భక్తులను సత్కరించి వేద ఆశీర్వచనం అందించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కారును ఢీకొన్న విమానం.. ఫ్లోరిడా రోడ్డుపై షాకింగ్ ఘటన
Akhanda 2 Review: లాజిక్స్ లేవమ్మా.. అన్నీ గూస్ బంప్సే!’ అఖండ2 మూవీ రివ్యూ
కొండ అంచున సెల్ఫీ.. కట్ చేస్తే… 130 అడుగుల నుండి
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

