Guntur: దర్జాగా గుడిలోకి వచ్చారు.. కూల్గా పని కానిచ్చారు.. ఆ తర్వాత
అత్తారింటికి వచ్చినట్టు వచ్చారు.. దర్జాగా చేయాల్సిన పని చేసి.. కూల్గా పక్కకి వెళ్లారు. ఆ తర్వాత సీన్ చూస్తే మైండ్ బ్లాంక్. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటి.? సీసీటీవీ కెమెరాలో కనిపించిన దృశ్యాలు ఏంటంటే.?
ఈ కలికాలంలో దేవుళ్లకు కూడా రక్షణ లేకుండాపోతోంది. దేవుళ్ల విగ్రహలను ముట్టుకుంటే షాక్ కొట్టేలా ఉపాయం ఏదైనా ఉంటే బాగుండనిపిస్తుంది. లేకుంటే గుళ్ల హుండీలు దొంగలకు ఏటీఎంలు అయిపోతాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలం బండారుపల్లి శ్రీ జల్లమ్మ ఆలయంలో భారీ చోరీ జరిగింది. ముసుగులు వేసుకుని ముగ్గురు వ్యక్తులు ఆలయంలో వచ్చి రూ. 2 లక్షల వరకు నగదును చోరీ చేశారు. సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిన చోరీ దృశ్యాల ద్వారా ఎంతమేరకు నగదు మాయం అయిందో ఆలయ కమిటీ సభ్యులు గుర్తించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ కమిటీ సభ్యులు.. వారి కంప్లైంట్ మేరకు దర్యాప్తు చేపట్టారు.
Follow Us
వైరల్ వీడియోలు
పాతబస్తీలో రెచ్చిపోయిన ఆటోడ్రైవర్..
సింగరేణి ఖిల్లాలో 'అమెరికా' కోడలు
షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్న టెన్త్ విద్యార్ధినిలు..
సిరిసిల్లలో పులి పంజా.. రంగంలోకి హైదరాబాద్ బృందం
ప్రపంచ వేదికపై తెలుగు తేజం !! సిక్కోలు యువకుడి ఘనత
చూపు కోల్పోయిన 9 మంది.. వికటించిన కంటి వైద్యం
శ్రీశైలం మల్లన్నకు కాసుల వర్షం..13 రోజుల్లోనే ఏకంగా..

