Guntur: దర్జాగా గుడిలోకి వచ్చారు.. కూల్గా పని కానిచ్చారు.. ఆ తర్వాత
అత్తారింటికి వచ్చినట్టు వచ్చారు.. దర్జాగా చేయాల్సిన పని చేసి.. కూల్గా పక్కకి వెళ్లారు. ఆ తర్వాత సీన్ చూస్తే మైండ్ బ్లాంక్. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటి.? సీసీటీవీ కెమెరాలో కనిపించిన దృశ్యాలు ఏంటంటే.?
ఈ కలికాలంలో దేవుళ్లకు కూడా రక్షణ లేకుండాపోతోంది. దేవుళ్ల విగ్రహలను ముట్టుకుంటే షాక్ కొట్టేలా ఉపాయం ఏదైనా ఉంటే బాగుండనిపిస్తుంది. లేకుంటే గుళ్ల హుండీలు దొంగలకు ఏటీఎంలు అయిపోతాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలం బండారుపల్లి శ్రీ జల్లమ్మ ఆలయంలో భారీ చోరీ జరిగింది. ముసుగులు వేసుకుని ముగ్గురు వ్యక్తులు ఆలయంలో వచ్చి రూ. 2 లక్షల వరకు నగదును చోరీ చేశారు. సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిన చోరీ దృశ్యాల ద్వారా ఎంతమేరకు నగదు మాయం అయిందో ఆలయ కమిటీ సభ్యులు గుర్తించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ కమిటీ సభ్యులు.. వారి కంప్లైంట్ మేరకు దర్యాప్తు చేపట్టారు.
Follow Us
వైరల్ వీడియోలు
ఒక్క మెసేజ్తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

