Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: రాత్రిపూట ఈ తప్పులు చేస్తే.. మీ పొట్ట గుట్టలా పెరుగుతుంది.!

Health: రాత్రిపూట ఈ తప్పులు చేస్తే.. మీ పొట్ట గుట్టలా పెరుగుతుంది.!

Anil kumar poka

|

Updated on: Jul 15, 2024 | 7:07 PM

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి లైఫ్‌ బిజీ బిజీ. బిజీ లైఫ్‌లో పని ఒత్తిడిలో పడి సరిగా ఆహారం తీసుకోకపోవడం సర్వసాధారణమైపోయింది. ఈ క్రమంలో చాలామంది పగలు కష్టపడి.. రాత్రిపూట ఫ్రీ టైంలో భోజనం చేసి రిలాక్స్ అవుతారు. అయితే రాత్రిపూజం భోజనం చేయడం మీ ఆరోగ్యంతో పాటు మీ బరువును కూడా ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా..? అవును, డిన్నర్ సమయంలో కొన్ని అలవాట్లు మీకు తెలియకుండానే మీ బరువు పెరిగేలా చేస్తాయి. సాధారణంగా అందరూ చేసే చిన్న చిన్నపొరపాట్లే మన బరువును పెంచుతాయి.

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి లైఫ్‌ బిజీ బిజీ. బిజీ లైఫ్‌లో పని ఒత్తిడిలో పడి సరిగా ఆహారం తీసుకోకపోవడం సర్వసాధారణమైపోయింది. ఈ క్రమంలో చాలామంది పగలు కష్టపడి.. రాత్రిపూట ఫ్రీ టైంలో భోజనం చేసి రిలాక్స్ అవుతారు. అయితే రాత్రిపూజం భోజనం చేయడం మీ ఆరోగ్యంతో పాటు మీ బరువును కూడా ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా..? అవును, డిన్నర్ సమయంలో కొన్ని అలవాట్లు మీకు తెలియకుండానే మీ బరువు పెరిగేలా చేస్తాయి. సాధారణంగా అందరూ చేసే చిన్న చిన్నపొరపాట్లే మన బరువును పెంచుతాయి. అందుకే మనకు తెలియకుండానే రాత్రిపూట మనవల్ల జరిగే ఇలాంటి 5 తప్పులను సరిదిద్దడం ద్వారా బరువు పెరగకుండా చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు.

కొంతమందికి రాత్రి భోజనం చేసిన వెంటనే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఇందులో ఉండే కెఫిన్ వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. నిద్ర లేకపోవడం వల్ల దాని ప్రభావం మీ బరువుపై కనిపిస్తుంది. క్రమంగా ఊబకాయం బారిన పడేలా చేస్తుంది. గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిదే… కానీ మీరు రాత్రి భోజనం తర్వాత దీనిని తీసుకుంటే మాత్రం హానికరం. రాత్రిపూట తీసుకుంటే.. నిద్రకు భంగం కలగడంతోపాటు బరువు పెరుగుతుంది.. ఎందుకంటే ఇది జీర్ణవ్యవస్థకు అవసరమైన పోషకాలను గ్రహించకుండా నిరోధిస్తుంది.

అలాగే నీరు త్రాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి అవసరమైనంత నీరు త్రాగాలి. కానీ రాత్రి భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం మంచిదికాదంటున్నారు నిపుణులు. ఆయుర్వేదం ప్రకారం, భోజనం మధ్యలో.. భోజనం తర్వాత ఒక నిర్దిష్ట వ్యవధి వరకు నీరు త్రాగకూడదు. ఇది జీర్ణక్రియ ప్రక్రియలో ఆటంకాలు కలిగిస్తుంది. అందువల్ల, తిన్న తర్వాత, నీరు త్రాగడానికి కనీసం 30 నిమిషాలు వేచి ఉండాలి. రాత్రి భోజనం చేసిన తర్వాత.. చాలా మంది వెంటనే మంచం మీద వాలిపోతుంటారు. ఇది మంచిది కాదు.. ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి, 10-15 నిమిషాలు నడవడం అవసరం. లేకపోతే, పేలవమైన జీర్ణక్రియ కారణంగా, అపానవాయువు దెబ్బతినడం, బరువు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.