తుపాకీ గురిపెట్టి.. వంట చేయించుకున్న ఉగ్రవాదులు

సైనిక వాహనంపై మెరుపుదాడి చేసి కఠువాకు సమీపంలో ఐదుగురు సైనికుల ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాదులు ఆ ఘటనకు ముందు స్థానికుల్ని బెదిరించినట్లు తాజాగా బయటపడింది. కణతకు తుపాకీ గురిపెట్టి, తమ కోసం భోజనం తయారు చేయించుకున్నారని కొందరు తెలిపారు. 10-15 మందికి సరిపడేంత ఆహారాన్ని వండి ఓ వ్యక్తికి అప్పగించిన మహిళను, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్లు భావిస్తున్న మరో ముగ్గురిని కూడా భద్రత బలగాలు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాయి.

తుపాకీ గురిపెట్టి.. వంట చేయించుకున్న ఉగ్రవాదులు

|

Updated on: Jul 15, 2024 | 6:32 PM

సైనిక వాహనంపై మెరుపుదాడి చేసి కఠువాకు సమీపంలో ఐదుగురు సైనికుల ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాదులు ఆ ఘటనకు ముందు స్థానికుల్ని బెదిరించినట్లు తాజాగా బయటపడింది. కణతకు తుపాకీ గురిపెట్టి, తమ కోసం భోజనం తయారు చేయించుకున్నారని కొందరు తెలిపారు. 10-15 మందికి సరిపడేంత ఆహారాన్ని వండి ఓ వ్యక్తికి అప్పగించిన మహిళను, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్లు భావిస్తున్న మరో ముగ్గురిని కూడా భద్రత బలగాలు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాయి. జులై 8న దాడికి పాల్పడిన సమయంలో ఉగ్రవాదులు బాడీ కెమెరాలు ధరించినట్లు తెలిసింది. భద్రతా బలగాల నుంచి ఆయుధాలను దోచుకునేందుకు ప్రయత్నించారు. దీనిని మన సైనికులు తిప్పికొట్టారు. గాయపడినా సరే వారికి మాత్రం ఆయుధాలను ఇవ్వలేదు. ఓ సైనికుడి చేతికి తీవ్రంగా గాయమైనప్పటికీ తన ఆయుధం జామ్‌ అయ్యేవరకు ఒక్క చేతితోనే కాల్పులు కొనసాగించాడు. తమ కళ్లెదురుగానే ఐదుగురు సహచర సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న జవాన్లు.. మరింత ప్రాణనష్టం జరగకుండా నిరోధించడానికి వీరోచితంగా పోరాడారు. ఆయుధాలను తీవ్రవాదులు ఎత్తుకుపోకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రతిఘటించారు. ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య రెండు గంటలకుపైగా కాల్పులు జరిగాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చెల్లెలి మృతదేహాన్ని 5 కి.మీ. భుజంపై మోసుకెళ్లిన అన్నలు

రోజుకు ఒక్కసారైనా నవ్వాలి.. జపాన్‌లో చట్టం

పాడుబడ్డ బావిలో వింత శబ్దాలు.. ఏంటని తొంగి చూసిన వారికి మైండ్ బ్లాక్

గుడ్‌న్యూస్‌.. వందేభారత్‌ స్లీపర్‌ వచ్చేస్తోంది.. ఈ రూట్లోనే !!

ప్రయాణికులకు అలర్ట్‌ !! ఈ రైళ్ల ప్రయాణ సమయాలు మారుతున్నాయ్‌

Follow us
ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఆర్మీ.. ఈ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్..
ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఆర్మీ.. ఈ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్..
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా
తెరపైకి సరికొత్త చర్చ.. ఆ పార్టీలో మొదలైన ప్రోటోకాల్ రచ్చ..
తెరపైకి సరికొత్త చర్చ.. ఆ పార్టీలో మొదలైన ప్రోటోకాల్ రచ్చ..
చూడ ముచ్చటైన డిజైన్‌తో సీఎమ్‌ఎఫ్‌ ఇయర్‌ బడ్స్‌..
చూడ ముచ్చటైన డిజైన్‌తో సీఎమ్‌ఎఫ్‌ ఇయర్‌ బడ్స్‌..
ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం.. పట్టు తప్పితే అంతే సంగతులు..
ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం.. పట్టు తప్పితే అంతే సంగతులు..
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. పంత్ ఔట్?
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. పంత్ ఔట్?
కాంగ్రెస్ గూటికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి..
కాంగ్రెస్ గూటికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి..
Controversy:వివాదస్పదమైన టీమిండియా మాజీ క్రికెటర్ల స్టెప్పులు..
Controversy:వివాదస్పదమైన టీమిండియా మాజీ క్రికెటర్ల స్టెప్పులు..
ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..
ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..
కూతురు శిక్షణ కోసం కారు, భూమిని అమ్మేసిన తండ్రి.. కట్‌చేస్తే
కూతురు శిక్షణ కోసం కారు, భూమిని అమ్మేసిన తండ్రి.. కట్‌చేస్తే