వందే భారత్ రైలు పై రాళ్ల దాడి.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు
వందే భారత్ రైలుపై కొందరు రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో ఒక కోచ్లోని కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ కోచ్లోని ప్రయాణికులు ఆందోళన చెందారు. పంజాబ్లో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉదయం అమృత్సర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై ఫగ్వారా ప్రాంతంలో రాళ్లు రువ్వారు. దీంతో సీ 3 కోచ్లోని రెండు విండో గ్లాస్లు పగుళ్లిచ్చాయి. పెద్ద శబ్దానికి అక్కడ కూర్చొన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు.
వందే భారత్ రైలుపై కొందరు రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో ఒక కోచ్లోని కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ కోచ్లోని ప్రయాణికులు ఆందోళన చెందారు. పంజాబ్లో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉదయం అమృత్సర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై ఫగ్వారా ప్రాంతంలో రాళ్లు రువ్వారు. దీంతో సీ 3 కోచ్లోని రెండు విండో గ్లాస్లు పగుళ్లిచ్చాయి. పెద్ద శబ్దానికి అక్కడ కూర్చొన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. అయితే ఎవరికీ ఏమీ జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న వందే భారత్ రైలు సిబ్బంది ఆ కోచ్ వద్దకు చేరుకున్నారు. రాళ్ల దాడిలో ధ్వంసమైన కిటికీ అద్దాలను పరిశీలించారు. కొందరు పిల్లలు రాళ్లు విసిరినట్లు ప్రయాణికులు ఆరోపించారు. అయితే ఈ సంఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్గంలో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరగడం ఇదే తొలిసారని వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంత్యక్రియలు జరిగిన 13 రోజుల తర్వాత.. ఇంటికి తిరిగొచ్చిన వ్యక్తి
గృహజ్యోతి పథకంలో రూ.లక్షల్లో కరెంట్ బిల్లు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

