పాము కూర వండుకుని తిన్న తమిళనాడు వ్యక్తి జైలుపాలు
పాము చర్మం ఒలిచి, కూర వండుకుని తిన్న యువకుడిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. పాము చర్మాన్ని ఒలుస్తున్న వీడియో వైరల్ అవ్వడం వల్ల రంగంలోకి దిగిన పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. తిరుపత్తూరు జిల్లాలోని పెరుమపట్టు ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల రాజేశ్ కుమార్ పాము చర్మాన్ని ఒలుస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది.
పాము చర్మం ఒలిచి, కూర వండుకుని తిన్న యువకుడిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. పాము చర్మాన్ని ఒలుస్తున్న వీడియో వైరల్ అవ్వడం వల్ల రంగంలోకి దిగిన పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. తిరుపత్తూరు జిల్లాలోని పెరుమపట్టు ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల రాజేశ్ కుమార్ పాము చర్మాన్ని ఒలుస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. దీంతో జిల్లా అటవీశాఖ అధికారి మహేంద్రన్ ఆ వీడియాపై విచారణకు ఆదేశించారు. వీడియో ద్వారా రాజేశ్ను గుర్తించిన స్థానిక అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టగా రాజేశ్ పాము చర్మాన్ని ఒలిచి, కూర వండుకుని కూడా తిన్నట్లు తేలింది. దీంతో వన్య జంతు సంరక్షణ చట్టం కింద అతడిని అరెస్టు చేసి తిరుపత్తూరు కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత జైలుకు తరలించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు

