గృహజ్యోతి పథకంలో రూ.లక్షల్లో కరెంట్ బిల్లు
ఎప్పటిలాగే ఈ నెల కూడా కరెంట్ రీడింగ్ తీసుకోడానికి ట్రాన్స్కో సిబ్బంది వచ్చి రీడింగ్ తీసి బిల్లు ఇచ్చారు. ఆ బిల్లు చూసిన ఆ ఇంటి యజమానికి గుండె ఆగినంత పనైంది. గృహజ్యోతి పథకం కింద సబ్సిడీతో రూ.200ల లోపు వచ్చే బిల్లు ఈసారి ఏకంగా లక్షల్లో రావడంతో ఆ వ్యక్తి లబోదిబోమన్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలం రహీంఖాన్ పేట గ్రామానికి చెందిన డి. పరశురాములు గృహజ్యోతి పథకం కింద విద్యుత్ బిల్లులో సబ్సిడీ పొందుతున్నాడు.
ఎప్పటిలాగే ఈ నెల కూడా కరెంట్ రీడింగ్ తీసుకోడానికి ట్రాన్స్కో సిబ్బంది వచ్చి రీడింగ్ తీసి బిల్లు ఇచ్చారు. ఆ బిల్లు చూసిన ఆ ఇంటి యజమానికి గుండె ఆగినంత పనైంది. గృహజ్యోతి పథకం కింద సబ్సిడీతో రూ.200ల లోపు వచ్చే బిల్లు ఈసారి ఏకంగా లక్షల్లో రావడంతో ఆ వ్యక్తి లబోదిబోమన్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలం రహీంఖాన్ పేట గ్రామానికి చెందిన డి. పరశురాములు గృహజ్యోతి పథకం కింద విద్యుత్ బిల్లులో సబ్సిడీ పొందుతున్నాడు. అయితే మంగళవారం రీడింగ్ తీసుకోడానికి వచ్చిన ట్రాన్స్కో సిబ్బంది రీడింగ్ తీయగా ఒక్క నెలకి ఏకంగా 5,40,927 యూనిట్లు వాడినట్టు రావడంతో ఇంటి యాజమాని అవాక్కయ్యాడు. గృహజ్యోతి కింద సబ్సిడీ వస్తున్న విద్యుత్తు బిల్లు ఏకంగా రూ.6,72,642 రావడం ఏంటని ట్రాన్స్కో సిబ్బందిని ప్రశ్నించాడు. ఈ విషయమై ట్రాన్స్కో ఏఈ ప్రభాకర్రెడ్డిని వివరణ కోరగా.. రీడింగ్ తీస్తున్న సమయంలో హై ఓల్టేజ్ వచ్చినట్టయితే రీడింగ్ జంప్ అయ్యి పెద్ద మొత్తంలో బిల్లు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. అధిక బిల్లు వచ్చిన మీటర్ను టెస్టింగ్ కోసం పంపినట్టు ఏఈ వివరించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!
మత్స్యకారులకు ముందే వచ్చిన ఉగాది.. వలలో చిక్కిన భారీ చేప
కోనసీమలో 'మూకుడు రొట్టె'కు పెరిగిన డిమాండ్!
మున్సిపాలిటీ వాటరే కదా అని కార్లు కడుగుతున్నారా? జాగ్రత్త!
సిలిండర్ తీసుకున్నారు సరే..మరి రశీదు ఏది?
నటి శ్రీదేవి ఆస్తుల వివాదం.. కోర్టుకెక్కిన బోనీ కపూర్
ఫ్లయిట్లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

