పిల్లలను ఎస్ఐలను చేయడానికి.. పేపర్ లీక్ చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు
కంచే చేనును మేసిన చందంగా ఉంది రాజస్థాన్లో ఎస్ఐ పరీక్షల వ్యవహారం. ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడే తన పిల్లలను సబ్-ఇన్స్పెక్టర్లుగా ఎంపిక చేయడానికి పరీక్షపత్రం లీక్ చేసిన వైనం బయటపడింది. 2021లో నాటి రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు రాము రాం రైకా తన కుమారుడు, కుమార్తె కోసం ఆ ఏడాది ఎస్ఐ పరీక్షల పత్రం లీక్ చేశాడు. ఈ పరీక్షలో అతడి పిల్లలు ఇద్దరూ టాపర్లుగా నిలిచారు. ఈ కేసులో అధికారులు రైకాను అరెస్టు చేశారు.
కంచే చేనును మేసిన చందంగా ఉంది రాజస్థాన్లో ఎస్ఐ పరీక్షల వ్యవహారం. ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడే తన పిల్లలను సబ్-ఇన్స్పెక్టర్లుగా ఎంపిక చేయడానికి పరీక్షపత్రం లీక్ చేసిన వైనం బయటపడింది. 2021లో నాటి రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు రాము రాం రైకా తన కుమారుడు, కుమార్తె కోసం ఆ ఏడాది ఎస్ఐ పరీక్షల పత్రం లీక్ చేశాడు. ఈ పరీక్షలో అతడి పిల్లలు ఇద్దరూ టాపర్లుగా నిలిచారు. ఈ కేసులో అధికారులు రైకాను అరెస్టు చేశారు. రైకా 2018-2022 వరకు ఆర్పీఎస్సీ సభ్యుడిగా ఉన్నాడు. ఈ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే రైకా పిల్లలు ట్రైనీ ఎస్ఐలు శోభా, దేవేశ్ను అధికారులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో అరెస్టైన ట్రైనీ ఎస్ఐలకు అధికారులు మళ్లీ అదే పరీక్ష నిర్వహించారు. వారికి వచ్చిన గత, ఇప్పటి మార్కులు చూసి అధికారులకు కళ్లు తిరిగినంత పనైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓవర్టైమ్ చేసి గుండె వ్యాధుల బారిన పడుతున్న ఉద్యోగులు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం
నెరవేరిన కల.. అంతలోనే చిదిమేసిన మృత్యువు..
దారుణం.. మనిషి చనిపోయినా పట్టించుకోకుండా.. చేపల కోసం ఎగబడ్డ జనం
అర్థరాత్రి రైడ్తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే

