AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Padmarajan: గజ్వేల్‌లో నామినేషన్ వేసిన తమిళనాడు వాసి.. ఎలక్షన్స్ కింగ్

Padmarajan: గజ్వేల్‌లో నామినేషన్ వేసిన తమిళనాడు వాసి.. ఎలక్షన్స్ కింగ్

TV9 Telugu
| Edited By: |

Updated on: Nov 03, 2023 | 2:11 PM

Share

గజ్వేల్ అంటే గుర్తు వచ్చేది కేసీఆర్.. కేసీఆర్ సొంత నియోజవర్గంతో పాటు అయిన ఫాంహౌజ్ కూడా ఇక్కడే ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి ఇక్కడే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయతే మొదటి రోజు నామినేషన్ రోజు గజ్వేల్ లో ఆసక్తికర సంఘటన జరిగింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శుక్రవారం గజ్వేల్ నియోజక వర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తమిళనాడు రాష్ట్రం నుంచి సేలం వాసి పద్మరాజన్.. 66 ఏళ్ల వయ్సులోనూ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈయనను ఎలక్షన్స్ కింగ్ అంటారు.

గజ్వేల్ అంటే గుర్తు వచ్చేది కేసీఆర్.. కేసీఆర్ సొంత నియోజవర్గంతో పాటు అయిన ఫాంహౌజ్ కూడా ఇక్కడే ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి ఇక్కడే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయతే మొదటి రోజు నామినేషన్ రోజు గజ్వేల్ లో ఆసక్తికర సంఘటన జరిగింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శుక్రవారం గజ్వేల్ నియోజక వర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తమిళనాడు రాష్ట్రం నుంచి సేలం వాసి పద్మరాజన్.. 66 ఏళ్ల వయ్సులోనూ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈయనను ఎలక్షన్స్ కింగ్ అని పిలుస్తారు. ఈ సందర్భంగా పద్మరాజన్ మాట్లాడుతూ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన ఎమ్మెల్యే ఎన్నికల్లో 236 నామినేషన్లు వేయడం జరిగిందని ఈరోజు గజ్వేల్ ఎమ్మెల్యే గా సీఎం కేసీఆర్ పై పోటీ చేయడానికి 237 వ నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగిందని అన్నారు. గజ్వేల్‌లో ఇప్పటికే బీఆర్ఎస్ నుండి సీఎం కేసీఆర్, బీజేపీ నుండి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుండి నర్సారెడ్డిలు బరిలో ఉన్నారు.

మరిన్ని వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయడం