Watch: పట్టపగలు మెడికల్‌ షాపులో దొంగల బీభత్సం.. షాకింగ్‌ వీడియో వైరల్‌

అయితే తనకు అత్యవసర పని ఉందని చెప్పిన ఖాన్‌, రాజేష్‌ను ఆ షాపులో కూర్చొమని చెప్పి బయటకు వెళ్లాడు.. ఈ క్రమంలోనే కొంత సేపటి తర్వాత ముఖానికి ముసుగులు వేసుకున్న ఐదుగురు వ్యక్తులు రెండు బైకులపై ఆ షాప్‌ వద్దకు వచ్చారు. వారంతా షాపులోకి దూరి అక్కడున్న రాజేష్‌ కుమార్‌పై కర్రలు, కత్తులతో దాడి చేశారు.

Watch: పట్టపగలు మెడికల్‌ షాపులో దొంగల బీభత్సం.. షాకింగ్‌ వీడియో వైరల్‌

|

Updated on: Sep 21, 2024 | 7:22 PM

పంజాబ్‌లోని మోగా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సెప్టెంబర్ 18న డునెకే ప్రాంతంలోని స్నేహితుడు షంషేర్ ఖాన్‌ను కలిసేందుకు రాజేష్‌ కుమార్‌ అతడి షాపు వద్దకు వెళ్లాడు. అయితే తనకు అత్యవసర పని ఉందని చెప్పిన ఖాన్‌, రాజేష్‌ను ఆ షాపులో కూర్చొమని చెప్పి బయటకు వెళ్లాడు.. ఈ క్రమంలోనే కొంత సేపటి తర్వాత ముఖానికి ముసుగులు వేసుకున్న ఐదుగురు వ్యక్తులు రెండు బైకులపై ఆ షాప్‌ వద్దకు వచ్చారు. వారంతా షాపులోకి దూరి అక్కడున్న రాజేష్‌ కుమార్‌పై కర్రలు, కత్తులతో దాడి చేశారు. చివరకు దొంగలు కౌంటర్‌లోని క్యాష్‌, రాజేష్‌ మొబైల్‌ను తీసుకుని పారిపోయారు. ఇదంతా షాపులో అమర్చిన సీసీ కెమెరాలో రికార్డైంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow us