AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ పత్రిక పేరునే.. తెలుగుదేశం పార్టీకి పెట్టారా?

ఆ పత్రిక పేరునే.. తెలుగుదేశం పార్టీకి పెట్టారా?

Phani CH
|

Updated on: Aug 30, 2025 | 1:08 PM

Share

తెలుగు దేశం పార్టీ ఆవిర్బావం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశ రాజకీయ యవనికపై అదో ప్రభంజనం. సీని రంగంలో అగ్ర నటుడు నందమూరి తారకరామారావు రాజకీయ పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టడం నేటికీ భారతదేశంలో సంచలన రికార్డుగానే మిగిలింది. దాదాపు మూడు దశాబ్దాలుగా పాతుకుపోయిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలిస్తూ.. టీడీపీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది.

1983 జనవరి 5న జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ ప్రమాణ స్వీకారం చేసిన ఆ రోజు దేశ రాజకీయ చరిత్రలో చెరిగిపోని చిత్రం. అయితే ఇదంతా ఎలా ఉన్నా.. ఎన్టీఆర్ పెట్టే రాజకీయ పార్టీకి ఎలా బీజం పడింది..? ‘తెలుగుదేశం’ పేరును సూచించింది ఎవరు..? అనే చర్చ ఇటీవల రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. రాజకీయ పార్టీ పెట్టాలనుకున్న ఎన్టీఆర్‌కు పార్టీ పేరు సూచించింది ఈనాడు గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత రామోజీ రావేనట. అప్పటికే రాష్ట్రంలో ‘తెలుగుదేశం’ పేరుతో తెలుగు వార పత్రిక కొనసాగుతోంది. ఆ పత్రిక ఎడిటర్ కృష్ణా జిల్లా వీరులపాడుకు చెందిన సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ. 1949లోనే ఒక మహిళ పత్రికా సంపాదకురాలు స్థాయికి ఎదిగడం అసాధారణ విషయమే. సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మతో రామోజీరావు సంప్రదింపులు జరిపి ఆమె అనుమతితో ‘తెలుగుదేశం’ పేరును పార్టీకి ఖరారు చేశారు. ఆ తర్వాత అదే పేరు తెలుగు జాతి గౌరవం, ఔన్నత్యాన్ని నిలిపేదిగా నిలిచింది. ప్రపంచం నలుమూలలా తెలుగోడి సత్తాని వెలుగెత్తి చాటింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐఫోన్‌ తయారీలో కుప్పం ముద్ర

హైదరాబాద్‌లో బీచ్.. సముద్ర తీరాన్ని తలదన్నేలా ఏర్పాట్లు

ప్రపంచంలోనే రిచ్చెస్ట్ బెగ్గర్ ఏడాది సంపాదన ఎంతో తెలుసా?

Tribanadhari Barbarik: త్రిబాణధారి బార్బరిక్.. హిట్టా..? ఫట్టా..?

Bullet Train: ఏపీలో బుల్లెట్‌ రైలు పరుగులు