AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పొలంలో పాటలు పాడుతూ వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే..

Telangana: పొలంలో పాటలు పాడుతూ వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే..

P Shivteja
| Edited By: Ram Naramaneni|

Updated on: Jul 19, 2023 | 5:38 PM

Share

-- మెదక్ ఎమెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పొలంలోకి దిగి వరి నాట్లు వేశారు. కూలీలతో కలిసి నాట్లు వేస్తూ వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. హవేళి ఘనాపూర్ మండల పరిధిలోని చౌట్లపల్లి, శుక్లాల్‌పేట్ శివారులో రైతులతో మాట్లాడారు. ఇక వరినాట్లు వేస్తూ.. మహిళాకూలీలతో కలిసి పాటపాడారు.

మెదక్, జులై 19: కష్ట జీవులతో కలిసి ఇలా పొలంలో కాసేపు పనిచేయడం సంతోషంగా ఉందన్నారు పద్మాదేవేందర్‌రెడ్డి. వారికి ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో స్థానికంగా పరిస్థితులపై అధికారులతోనూ మాట్లాడారు. ఎమ్మెల్యేనే పొలంలోకి దిగి తమతో కలిసి వరి నాట్లు వేయడంతో సంతోషం వ్యక్తం చేసారు రైతులు.