ఏపీలో 11 మంది ఐఏఎస్ ల బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమైన బదిలీల్లో టీటీడీ ఈవో శ్యామల్ రావు బదిలీ అవ్వగా, అనిల్ కుమార్ సింహాల్ను కొత్త ఈవోగా నియామకం అయ్యారు. ఇతర ముఖ్యమైన శాఖలకు కూడా అధికారులను బదిలీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 11 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ ఉత్తర్వులను విడుదల చేశారు. టీటీడీ ఈవోగా ఉన్న శ్యామల్ రావును బదిలీ చేసి, ఆయన స్థానంలో అనిల్ కుమార్ సింహాల్ను నియమించారు. అనిల్ కుమార్ సింహాల్ 2014-19 మధ్య టీడీపీ హయాంలో కూడా టీటీడీ ఈవోగా పనిచేశారు. ఇతర బదిలీలలో ఎక్సైజ్ అండ్ మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా ముకేష్ కుమార్ మీనా, అటవీ పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా కాంతిలాల్ దండే, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా సౌరవ్ గౌర్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా ప్రవీణ్ కుమార్, మరికొందరు అధికారులు ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Onion Rates: ఉల్లి ధరపై.. ఆగని రైతుల లొల్లి
ఇదెక్కడి వాతావరణం.. ఇక్కడేమో ఎండలు.. అక్కడేమో వర్షాలు
రైల్వే ట్రాక్ను కమ్మేసిన పొగ..నిలిచిపోయిన రైలు
ఆ దేశంలో ఆఫీసులు .. స్వర్గానికి స్పాట్లు
వీళ్లు మనుషులేనా.. పెళ్లిలోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు కదా!
గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. ముప్పు తప్పదా?
ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఆ సీక్రెట్ ఫైల్స్లో ఏముంది?
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు

