Sabarimala: మకరజ్యోతి దర్శనానికి వీరికి నో ఎంట్రీ.! శబరిమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.

శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అయ్యప్ప దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో శబరిగిరులు కిక్కిరిసిపోయాయి. స్వామి దర్శనం కోసం భక్తులు వేలాదిగా క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు భక్తులందరికీ స్వామివారి దర్శనం కలిగేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. దగ్గరుండి స్వామివారి దర్శనానికి పంపిస్తున్నారు భద్రతా సిబ్బంది. మణికంఠుడి దర్శనానికి 12 గంటలు సమయం పడుతోంది.

Sabarimala: మకరజ్యోతి దర్శనానికి వీరికి నో ఎంట్రీ.! శబరిమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.

|

Updated on: Jan 04, 2024 | 4:56 PM

శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అయ్యప్ప దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో శబరిగిరులు కిక్కిరిసిపోయాయి. స్వామి దర్శనం కోసం భక్తులు వేలాదిగా క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు భక్తులందరికీ స్వామివారి దర్శనం కలిగేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. దగ్గరుండి స్వామివారి దర్శనానికి పంపిస్తున్నారు భద్రతా సిబ్బంది. మణికంఠుడి దర్శనానికి 12 గంటలు సమయం పడుతోంది. మరోవైపు భక్తుల రద్దీ దృష్ట్యా ట్రావెన్‌కోర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 10 నుంచి స్పాట్‌ బుకింగ్‌ రద్దు చేసింది. అలాగే మకరజ్యోతి దర్శనానికి మహిళలు, చిన్నపిల్లలు రావద్దని సూచించింది. ఇంకోవైపు ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకున్నవారికే దర్శనం కల్పించనున్నట్టు తెలిపింది. అంతేకాదు, జనవరి 14న 40 వేలమందికి, జనవరి 15వ తేదీన 50 వేలమందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నట్టు తెలిపింది. భక్తులు సహకరించాలని అధికారులు సూచించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow us