Komati Reddy: తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే స్థానాలు ఎన్నంటే.. మంత్రి కోమటి రెడ్డి లెక్క ఇదే..
బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మూడోసారి మోదీ ప్రధాని అయితే దేశంలో ఇక ఎన్నికలు ఉండవన్నారు. మన దేశంలోనూ రష్యా, చైనా తరహా పాలన వస్తుందని కీలక ఆరోపణలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చి వాళ్లే పాలకులుగా ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 కోట్ల మంది ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తామని ఎలా అంటారని బీజేపీకి కౌంటర్ వేశారు. వాళ్లంతా రోడ్ల మీదకు వస్తే ఏం జరుగుతుందో తెలుసా అని హెచ్చరించారు.
బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మూడోసారి మోదీ ప్రధాని అయితే దేశంలో ఇక ఎన్నికలు ఉండవన్నారు. మన దేశంలోనూ రష్యా, చైనా తరహా పాలన వస్తుందని కీలక ఆరోపణలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చి వాళ్లే పాలకులుగా ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 కోట్ల మంది ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తామని ఎలా అంటారని బీజేపీకి కౌంటర్ వేశారు. వాళ్లంతా రోడ్ల మీదకు వస్తే ఏం జరుగుతుందో తెలుసా అని హెచ్చరించారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుందని విమర్శించారు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ శకం ముగిసిపోయిందని.. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం 17 స్థానాలకుగానూ 14 సీట్లు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీ లక్ష్యం 15 స్థానాల్లో విజయం సాధించడమని, అయితే 14 స్థానాల్లో గెలుస్తామన్న నమ్మకం తమకు ఉందని తెలిపారు. జూన్ 5 తరువాత దేశంలో చాలా మార్పులు వస్తాయన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

