EPFO Customers: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.! ఆ సేవలకు అంతరాయం..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సేవలకు అంతరాయం ఏర్పడింది. ఆధార్ అథెంటికేషన్కు సంబంధించిన సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని EPFO ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఆధార్ అథెంటికేషన్ సేవలు ప్రస్తుతం అందుబాటులో లేవంటూ ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. ఇదే విషయాన్ని తెలుపుతూ ఓ ఖాతాదారుడు.. గత నాలుగు రోజులుగా తాను ఈ సమస్య ఎదుర్కొంటున్నట్లు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సేవలకు అంతరాయం ఏర్పడింది. ఆధార్ అథెంటికేషన్కు సంబంధించిన సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని EPFO ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఆధార్ అథెంటికేషన్ సేవలు ప్రస్తుతం అందుబాటులో లేవంటూ ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. ఇదే విషయాన్ని తెలుపుతూ ఓ ఖాతాదారుడు.. గత నాలుగు రోజులుగా తాను ఈ సమస్య ఎదుర్కొంటున్నట్లు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. దీనిపై స్పందించిన EPFO అధికారులు.. టెక్నికల్ మెయింటెనెన్స్ కారణాల వల్ల ఆధార్ అథెంటికేషన్ సేవలకు అంతారయం కలిగిందని, ఇందుకుగాను తాము చింతిస్తున్నట్లు తెలుపుతూ ట్వీట్ చేశారు. త్వరలోనే ఈ సేవలను పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే EPFO అకౌంట్ను ఆధార్తో లింక్ చేసుకోవాలని ఈపీఎఫ్ఓ ఇప్పటికే ప్రకటించింది. అకౌంట్ను డూప్లికేట్ చేసే ముప్పు తగ్గించడంతో పాటు, వ్యక్తిగత వివరాల డేటాలో తప్పులు ఉండే అవకాశం తగ్గించడానికి, పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవడం సులభతరం చేయడానికి ఆధార్తో లింక్ చేయాలని తెలిపారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం EPFO 277 మిలియన్లకు పైగా ఖాతాలు, దాదాపు రూ.20 లక్షల కోట్ల కార్పస్తో ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థగా ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్వా! డాక్టర్పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

