Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌లో త్వరలో స్కై బస్సు సర్వీసులు !! గంటకు 100 కి.మీ. వేగంతో ప్రయాణించే సామర్థ్యం

భారత్‌లో త్వరలో స్కై బస్సు సర్వీసులు !! గంటకు 100 కి.మీ. వేగంతో ప్రయాణించే సామర్థ్యం

Phani CH

|

Updated on: Oct 27, 2023 | 2:07 PM

భారతదేశంలోని ప్రముఖ నగరాల్లో ట్రాఫిక్ సమస్య గురించి తెలిసిందే. ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లాంటి నగరాల్లో ట్రాఫిక్‌ సమస్యలు ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు మెట్రోరైళ్లు, ఫ్లై ఓవర్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా స్కై బస్సు సర్వీసును అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. దేశంలో స్కై బస్సు వ్యవస్థను ప్రారంభిస్తామని కేంద్ర రవాణాశాఖమంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు

భారతదేశంలోని ప్రముఖ నగరాల్లో ట్రాఫిక్ సమస్య గురించి తెలిసిందే. ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లాంటి నగరాల్లో ట్రాఫిక్‌ సమస్యలు ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు మెట్రోరైళ్లు, ఫ్లై ఓవర్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా స్కై బస్సు సర్వీసును అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. దేశంలో స్కై బస్సు వ్యవస్థను ప్రారంభిస్తామని కేంద్ర రవాణాశాఖమంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 2003లో నూతన సంవత్సర కానుకగా గోవాకు స్కై బస్సు ప్రాజెక్టును ప్రకటించారు. మొదటి దశ కింద పైలట్ ప్రాజెక్ట్ మపుసా నుండి పనాజీకి అనుసంధానించాలనుకున్నారు. 100 కోట్ల ఖర్చుతో కూడుకున్న ఈ ప్రాజెక్ట్‌ రూపుదాల్చలేదు. ఈ ప్రాజెక్ట్‌ లాభదాయకం కాదని, 2016లో కొంకణ్ రైల్వే కార్పొరేషన్ స్కై బస్ ప్రాజెక్ట్‌ను రద్దు చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

10 నిమిషాల్లో పెళ్లి… పెళ్లి వద్దంటూ 100 కి డయల్ చేసిన వరుడు !!

Skanda OTT: బ్యాడ్‌ న్యూస్‌.. స్కంద ఓటీటీ స్ట్రీమింగ్‌ వాయిదా

Amala Paul: పబ్ లో ప్రపోజల్.. మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్న అమలాపాల్

Chiranjeevi: ముల్లోకాలను శాసించే విశ్వంభర..

అల్లు అర్జున్ ర్యాప్‌ సాంగ్.. నేషనల్ లెవల్లో అదరగొట్టిన హైద్రాబాదీ