Train Fire Accident: న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం.! అకస్మాత్తుగా చెలరేగిన మంటలు.
వరుస రైలు ప్రమాద ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్లో ఇటావా దగ్గర రైలులో మంటలు చెలరేగగా.. మూడు బోగీలు దగ్ధం అయ్యాయి. యూపీలోని ఇటావా సమీపంలోని సరాయ్ భూపత్ స్టేషన్ దగ్గరలో బుధవారం సాయంత్రం వేళ ఈ ఘటన జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
వరుస రైలు ప్రమాద ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్లో ఇటావా దగ్గర రైలులో మంటలు చెలరేగగా.. మూడు బోగీలు దగ్ధం అయ్యాయి. యూపీలోని ఇటావా సమీపంలోని సరాయ్ భూపత్ స్టేషన్ దగ్గరలో బుధవారం సాయంత్రం వేళ ఈ ఘటన జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఎస్ 1 బోగీలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు మరో రెండు బోగీలకు వ్యాపించాయి. రైలు సారాయ్ భూపత్ స్టేషన్ మీదుగా వెళుతున్న సమయంలో ఎస్ 1 బోగీలోంచి పొగలు రావడం గమనించిన స్టేషన్ మాస్టర్ వెంటనే రైలును ఆపేశారు. ఆ తరువాత సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం, మంటలను ఆర్పాక రైలు గమ్యస్థానం వైపు బయలుదేరింది. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని రైల్వే అధికారులు భావిస్తున్నారు. కాగా, మంటలను గుర్తించిన వెంటనే తాము రైలు కిటికీల్లోంచి దూకి బయటపడ్డామని ఓ ప్రయాణికుడు తెలిపాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
లంక రైతుల టెక్ వ్యూహం.. ఇక దొంగల సీన్ సితారే !!
పాట్నా స్టేషన్లో వింత దృశ్యం..ప్లాట్ఫామ్ నిండా పాదముద్రలే
గ్యాస్ బండ చోరీకి ప్లాన్.. కానీ అడ్డంగా బుక్కయ్యాడు
మానవత్వం మరిచిన సంస్థకు.. రూ.210 కోట్ల ఫైన్ వేసిన కోర్టు
రైలులో చిన్నారికి అస్వస్థత.. అప్పుడే ఓ అద్భుతం
ఆరు బ్యాంక్లకు కన్నం వేసిన దొంగ.. చివరికి..
సూర్యకాంతిని.. అమ్ముతామంటున్న స్టార్టప్ కంపెనీ

