Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందుకే సాయి పల్లవితో మళ్లీ నటించలేదు !! వరుణ్‌తేజ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

అందుకే సాయి పల్లవితో మళ్లీ నటించలేదు !! వరుణ్‌తేజ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Phani CH

|

Updated on: Feb 28, 2024 | 8:57 PM

డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమా సౌత్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించారు. ఈ సినిమాతోనే సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో వీరిద్దరి జోడికి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఇద్దరి కెమిస్ట్రీకి.. నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. ఇండస్ట్రీలోనే వీరిద్దరూ హిట్ పెయిర్ గా నిలిచారు. ఫిదా తర్వాత వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుందని చాలా మంది అనుకున్నారు.

డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమా సౌత్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించారు. ఈ సినిమాతోనే సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో వీరిద్దరి జోడికి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఇద్దరి కెమిస్ట్రీకి.. నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. ఇండస్ట్రీలోనే వీరిద్దరూ హిట్ పెయిర్ గా నిలిచారు. ఫిదా తర్వాత వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుందని చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పటివరకు మరోసారి ఆ కాంబో రిపీట్ కాలేదు. ప్రస్తుతం ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. అయితే ఫిదా తర్వాత మళ్లీ సాయి పల్లవితో కలిసి నటించకపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు వరుణ్ తేజ్‌. ప్రస్తుతం తాను నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్.. ఈ విషయంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. మా ఇద్దరి కాంబోలో మరో సినిమా రూపొందించేందుకు సన్నాహాలు జరిగాయి. ఇద్దరం కథ కూడా విన్నాం. కానీ ఈసారి చేస్తే ఫిదాను మించి ఉండాలని.. లేదంటే చేయకూడదని అనుకున్నాం. అందుకే మళ్లీ కలిసి నటించలేకపోయాం అని తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Srisailam: శ్రీశైల మల్లికార్జునుడికి విరాళాల వెల్లువ

మసాలాలతో క్యాన్సర్‌ నిరోధించే ఔషధాలు !! మద్రాస్ ఐఐటీ శాస్త్రవేత్తల పరిశోధన

బరువు తగ్గాలనుకునేవారు ఈ ఆహారం అస్సలు తీసుకోకూడదు

ప్రపంచంలో ఎవరిపై అయినా జూమ్‌ !! నింగిలోకి నిఘా ఉపగ్రహం

మెట్రో రైలు ఎక్కకుండా రైతును అడ్డుకున్న సెక్యూరిటీ అధికారులపై నెటిజన్లు ఫైర్‌