రేణుదేశాయ్ రిక్వెస్ట్ తో ఉపాసన ఆర్థిక సాయం !!
రేణుదేశాయ్ మూగ జీవాల సంరక్షణ కోసం శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్ పేరుతో ఏర్పాటు చేసిన సంస్థకు టాలీవుడ్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన తన సహాయ సహకారాలు అందించారు. ఈ మేరకు ఉపాసన సాయం అందించినట్లు సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయ్ తెలిపారు. ఈ సంస్థ కోసం ఓ అంబులెన్స్ను కొనుగోలు చేశానని, దీనికి ఉపాసన తనవంతు సాయం అందించారని తెలిపారు.
రామ్ చరణ్ పెంపుడు శునకం రైమీ పేరుతో ఈ సాయం చేసినట్లు తెలిపారు. అంబులెన్స్ను కొనుగోలు చేసేందుకు విరాళం అందించిన రైమీకి ధన్యవాదాలు అని రేణు దేశాయ్ పోస్ట్ పెట్టారు. దీనికి ఉపాసనను ట్యాగ్ చేశారు. తన స్వచ్ఛంద సంస్థకు విరాళాలు ఇవ్వాలని ఇన్స్టాగ్రాంలో రేణు దేశాయ్ విజ్ఞప్తి చేశారు. తమవంతు బాధ్యతగా ఎవరైనా ప్రతీ నెల కనీసం రూ.100 కూడా సాయం చేయవచ్చునని పేర్కొన్నారు. ఇది తన వ్యక్తిగత అవసరాల కోసం కాదని, తాను స్థాపించిన స్వచ్ఛంద సేవా సంస్థ కోసం ఖర్చు చేస్తానని స్పష్టం చేశారు. మూగ జీవాల కోసం ఏదైనా చేయాలని తనకు చిన్నప్పటి నుంచి కోరిక అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓరీ దేవుడా.. కట్టెల కోసం కొండపైకి వెళ్తే.. తల్లీబిడ్డలపై దాడి చేసిన కందిరీగలు.. చివరికి ??
Pushpa 2: ఇండియన్ సినిమా చరిత్రలోనే.. నయా రికార్డ్ !!
రాత్రి భోజనం మానేస్తున్నారా ?? నిజంగా ధైర్యం ఉంటే ఆ పని చేయండి
Mayonnaise: అమ్మో మయోనైజ్.. తింటే అంత డేంజరా ??
Gold Price: బంగారం బరువాయెనా ?? రోజురోజుకు పెరుగుతున్న పసిడి ధరలు
ఎన్ని గుండెలురా వీళ్లవి.! ఏకంగా పోలీసులతోనే ఫైట్కి దిగారు..
అమ్మవారి విగ్రహానికి చెమటలు.. పూనకాలతో ఊగిపోయిన భక్తులు
అద్భుతం.. రామాలయంలో హనుమంతుడు ప్రత్యక్షం
షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ దుకాణాలు బంద్
ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి
తండ్రికి ప్రేమగా మిల్క్ షేక్ అందించిన కుమార్తె..ఆ తర్వాత..
ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!

