రేణుదేశాయ్ రిక్వెస్ట్ తో ఉపాసన ఆర్థిక సాయం !!
రేణుదేశాయ్ మూగ జీవాల సంరక్షణ కోసం శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్ పేరుతో ఏర్పాటు చేసిన సంస్థకు టాలీవుడ్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన తన సహాయ సహకారాలు అందించారు. ఈ మేరకు ఉపాసన సాయం అందించినట్లు సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయ్ తెలిపారు. ఈ సంస్థ కోసం ఓ అంబులెన్స్ను కొనుగోలు చేశానని, దీనికి ఉపాసన తనవంతు సాయం అందించారని తెలిపారు.
రామ్ చరణ్ పెంపుడు శునకం రైమీ పేరుతో ఈ సాయం చేసినట్లు తెలిపారు. అంబులెన్స్ను కొనుగోలు చేసేందుకు విరాళం అందించిన రైమీకి ధన్యవాదాలు అని రేణు దేశాయ్ పోస్ట్ పెట్టారు. దీనికి ఉపాసనను ట్యాగ్ చేశారు. తన స్వచ్ఛంద సంస్థకు విరాళాలు ఇవ్వాలని ఇన్స్టాగ్రాంలో రేణు దేశాయ్ విజ్ఞప్తి చేశారు. తమవంతు బాధ్యతగా ఎవరైనా ప్రతీ నెల కనీసం రూ.100 కూడా సాయం చేయవచ్చునని పేర్కొన్నారు. ఇది తన వ్యక్తిగత అవసరాల కోసం కాదని, తాను స్థాపించిన స్వచ్ఛంద సేవా సంస్థ కోసం ఖర్చు చేస్తానని స్పష్టం చేశారు. మూగ జీవాల కోసం ఏదైనా చేయాలని తనకు చిన్నప్పటి నుంచి కోరిక అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓరీ దేవుడా.. కట్టెల కోసం కొండపైకి వెళ్తే.. తల్లీబిడ్డలపై దాడి చేసిన కందిరీగలు.. చివరికి ??
Pushpa 2: ఇండియన్ సినిమా చరిత్రలోనే.. నయా రికార్డ్ !!
రాత్రి భోజనం మానేస్తున్నారా ?? నిజంగా ధైర్యం ఉంటే ఆ పని చేయండి
Mayonnaise: అమ్మో మయోనైజ్.. తింటే అంత డేంజరా ??
Gold Price: బంగారం బరువాయెనా ?? రోజురోజుకు పెరుగుతున్న పసిడి ధరలు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

