AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TOP 9 ET News: చిరుతో మొదలెట్టి ప్రభాస్‌ వరకు.. ఫ్యాన్స్‌కు బన్నీ పిచ్చ క్లారిటీ..

TOP 9 ET News: చిరుతో మొదలెట్టి ప్రభాస్‌ వరకు.. ఫ్యాన్స్‌కు బన్నీ పిచ్చ క్లారిటీ..

Phani CH
|

Updated on: Nov 17, 2024 | 4:51 PM

Share

ఎందుకో తెలీదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను సోషల్ మీడియాలో కొందరు అదే పనిగా ట్రోల్ చేస్తుంటారు. ఆయన కామెంట్స్‌ను.. మాటలను.. చేతలను.. కొన్ని సార్లు తప్పుగా పోట్రే చేసే పని చేస్తుంటారు. రిమైనింగ్ హీరోల ఫ్యాన్స్‌ను కూడా ఇందులోకి లాగి బన్నీపై విమర్శలు చేసేలా చేస్తుంటారు. కానీ బన్నీ మాత్రం వీటన్నింటికీ టైం వచ్చినప్పడే సమాధానం ఇస్తుంటాడు.

ఇప్పుడు కూడా అన్‌స్టాపబుల్ సీజన్ 4లో అదే చేశాడు. చాలా స్మూత్‌గా.. చాలా గట్టిగా.. రీసౌండ్‌ వచ్చేలా.. క్లారిటీ ఇచ్చాడు. మెగా స్టార్తో మొదలు కొని.. ప్రభాస్‌ వరకు అందరి హీరోలు తన వాళ్లే అనేలా జవాబు చెప్పాడు. తన మాటలతో ఇప్పుడు అందర్నీ ఖుషీ అయేలా చేస్తున్నాడు మన ఐకాన్ స్టార్. నయనతార డాక్యుమెంటరీలో కొన్ని క్లిప్స్ వాడకంపై కోలీవుడ్ హీరో ధనుష్ అభ్యంతరం వ్యక్తం చేయడం తీవ్రంగా రియాక్టయింది నయనతార. ధనుష్‌ పై ఆయన వ్యక్తిత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. సుదీర్ఘ లెటర్‌ను తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేసింది. ఆ లెటర్‌లో ధనుష్‌ను నెపోకిడ్ అంటూ కోట్ చేసింది. అంతేకాదు తన కావాలనే ధనుష్‌ కుట్ర చేస్తున్నాడని కోపగించుకుంది. ఇక నయన్ డాక్యుమెంటరీ షోలో.. తన బ్యానర్‌లో నిర్మించిన నానుమ్ రౌడీదాన్‌ సినిమా క్లిప్‌ను అనుమతి లేకుండా వాడినందుకు పది కోట్లు చెల్లించాలంటూ కాపీ రైట్‌ నోటీసులు ఇచ్చాడు ధనుష్. ఈ విషయంపైనే ఈమె సీరియస్ అయింది. మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: బన్నీ టీం మాస్టర్ ప్లాన్ !! అందుకే పుష్ప2 ట్రైలర్ రిలీజ్‌ బిహార్‌లో..

Published on: Nov 17, 2024 04:32 PM