Madhumitha: ముచ్చటపడి కార్ కొని.. అడ్డొచ్చిన కానిస్టేబుల్నే గుద్దిన నటి.! వీడియో వైరల్
ప్రముఖ బుల్లితెర నటి మధుమితపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ మూసివేసిన రహదారిపై తన కొత్త కారును డ్రైవ్ చేసి చిక్కుల్లో ఇరుక్కుంది. అంతటితో ఆగకుండా మోటార్ సైకిల్ నడుపుతున్న పోలీసు అధికారిపైకి దూసుకెళ్లింది. దీంతో చెన్నైలోని ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళ సీరియల్ 'ఎతిర్నీచల్' ఫేమ్ మధుమిత వారం క్రితం కొత్తగా కొన్న కారును డ్రై చేసుకుంటూ వెళ్లి ఓ దేవాలయాన్ని సందర్శించింది.
ప్రముఖ బుల్లితెర నటి మధుమితపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ మూసివేసిన రహదారిపై తన కొత్త కారును డ్రైవ్ చేసి చిక్కుల్లో ఇరుక్కుంది. అంతటితో ఆగకుండా మోటార్ సైకిల్ నడుపుతున్న పోలీసు అధికారిపైకి దూసుకెళ్లింది. దీంతో చెన్నైలోని ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళ సీరియల్ ‘ఎతిర్నీచల్’ ఫేమ్ మధుమిత వారం క్రితం కొత్తగా కొన్న కారును డ్రై చేసుకుంటూ వెళ్లి ఓ దేవాలయాన్ని సందర్శించింది. అనంతరం షోలింగనల్లూర్ నుంచి తిరిగి వస్తున్న క్రమంలో అక్కరై మీదుగా ECRకి వెళ్లడానికి ప్రయత్నించింది. దీంతో వన్-వే స్ట్రెచ్లో రాంగ్ సైడ్లో డ్రైవ్ చేసి, ఎదురుగా బైక్ నడుపుతున్న పోలీసు కానిస్టేబుల్ను ఢీ కొట్టింది. కానిస్టేబుల్ను సెమ్మంచెరి పోలీస్ స్టేషన్లో రైటర్గా పనిచేస్తున్న రవికుమార్గా గుర్తించారు. బైక్పై నుంచి కిందపడటంతో కానిస్టేబుల్కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో రెండు వాహనాలు తీవ్రంగా శిథిలమయ్యాయి. గాయాలపాలైన రవికుమార్ను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. అందించారు. ఇక రాంగ్ రూట్లో వెళ్లి కానిస్టేబుల్ బైక్ ను ఢీకొట్టడమే కాదు.. స్టేబులే ర్యాష్ గా డ్రైవింగ్ చేసిటన్లు మధుమిత వాదించింది. దీనిపై ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు మధుమితపై 279 సెక్షన్ ర్యాష్ డ్రైవింగ్ కింద, 337 సెక్షన్.. ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించడం, గాయపరచడం కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణల కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos