వివాదాస్పద సినిమా రిలీజ్ పై.. తుది నిర్ణయం తీసుకున్న హైకోర్టు..
తెలంగాణ గడ్డపై పోరాడిన వీరుల చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం రజాకార్ - ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్. ఈ సినిమాకు యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించగా.. బాబీ సింహా, వేదిక లీడ్ రోల్స్ లో నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఈనెల 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ భాషలలో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే రజాకార్ సినిమా విడుదలను ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
తెలంగాణ గడ్డపై పోరాడిన వీరుల చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం రజాకార్ – ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్. ఈ సినిమాకు యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించగా.. బాబీ సింహా, వేదిక లీడ్ రోల్స్ లో నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఈనెల 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ భాషలలో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే రజాకార్ సినిమా విడుదలను ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మూవీ ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందంటూ అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ కోర్టులో పిటిషన్ వేసింది. అయితే ఈ పిటిషన్ను తాజాగా పక్కకు పెట్టి… రజాకార్ మేకర్స్కు అనుకూలంగా తీర్పునిచ్చింది తెలంగాణ హై కోర్టు. ఇక విచారణలో భాగంగా… ఈ చిత్రానికి సెన్సార్ బోర్టు సర్టిఫికెట్ జారీ చేసిందని నిర్మాత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఈ సినిమాపై అభ్యంతరం ఉంటే నిపుణుల కమిటీకి, కేంద్రానికి ఫిర్యాదు చేయాలని పిటిషనర్ కు కోర్టు సూచించింది. సెన్సార్ బోర్టు సర్టిఫికెట్ ను సవాలు చేయనందున ఎలాంటి ఉత్తర్వ్యులు ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్కు ఫిదా నెటిజన్లు

