Sonu sood tweet: ఐటీ దాడులపై సోనూసూద్ భావోద్వేగ ట్వీట్..! వైరల్ అవుతున్న వీడియో..
బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇళ్లపై ఆదాయపు పన్నుశాఖ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆయన 20 కోట్ల రూపాయల వరకు పన్ను ఎగ్గొట్టినట్లు తెలిపింది. కరోనా కాలంలో విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా 2 కోట్ల 10 లక్షల రూపాయల విరాళాలు సేకరించారని ఐటీ అధికారులు తేల్చిచెప్పారు.
బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇళ్లపై ఆదాయపు పన్నుశాఖ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆయన 20 కోట్ల రూపాయల వరకు పన్ను ఎగ్గొట్టినట్లు తెలిపింది. కరోనా కాలంలో విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా 2 కోట్ల 10 లక్షల రూపాయల విరాళాలు సేకరించారని ఐటీ అధికారులు తేల్చిచెప్పారు. దాదాపు 4 రోజుల పాటు ఐటీ అధికారులు సోనూసూద్ను ప్రశ్నించారు.
అయితే ఐటీ దాడుల తర్వాత తాజాగా సోనూసూద్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ఎమెషనల్ పోస్టు పెట్టారు….‘ప్రతి భారతీయుని ప్రార్థనల ప్రభావం గొప్పవి… ఎంతలా అంటే దెబ్బతిన్న రోడ్లలో కూడా ప్రయాణం చాలా సులువవుతుంది’ అని రాసుకొచ్చారు. అలాగే ‘ నీలోని నిజాయితీని నువ్వు చెప్పుకోనక్కరలేదు. కాలమే బయటపెడుతుంది. ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాను. అదే నాకు బలాన్నిస్తుంది. నా ఫౌండేషన్ తరపున ఖర్చుచేస్తున్న ప్రతీ రూపాయీ ఒక విలువైన జీవితాన్ని కాపాడటంతో పాటు అర్హులకు చేరుతుంది. ఇదేవిధంగా నేను మద్దతు పలుకుతున్న బ్రాండ్ల నుంచి వస్తున్న ఆదాయాన్ని అవసరాల్లో ఉన్న వారికి అందిస్తుంటాను. ఇది నిర్విరామంగా కొనసాగుతుంటుంది. నా జర్నీ ఇలాగే కొనసాగుతుంటుంది… జై హింద్… సోనూసూద్’ అని రాశారు.
మరిన్ని చదవండి ఇక్కడ : 5 doses vaccine Video: ‘5 డోసులు ఇచ్చాం.. ఆరో డోసుకు ఆ రోజు రండి..!’ సర్టిఫికెట్ చూసి షాకైన వ్యక్తి..(వీడియో)
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే

