సినిమాకు రూ.21 కోట్లు.. కనీసం వాచ్ మెన్‌ను పెట్టుకోలేరా ??

సినిమాకు రూ.21 కోట్లు.. కనీసం వాచ్ మెన్‌ను పెట్టుకోలేరా ??

Phani CH

|

Updated on: Feb 05, 2025 | 1:12 PM

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి బాలీవుడ్ లో కలకలం రేపింది. ఈ ఘటనతో ముంబై లాంటి మహా నగరంలో సెలబ్రిటీల భద్రతపై సందేహాలు, అనుమానాలు తలెత్తాయి. ముఖ్యంగా దాడి సమయంలో సైఫ్- కరీనాల ఇంట్లో సెక్యూరిటీ గార్డులు లేరా? అని చాలామంది ప్రశ్నలు లేవనెత్తారు.

ఇదిలా ఉండగా, ప్రముఖ నటుడు, దర్శకుడు ఆకాశ్‌దీప్ సబీర్‌, అతని భార్య షీబా ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో సైఫ్ సతీమణి, నటి కరీనా కపూర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ‘ఇంటిని భద్రంగా ఉంచుకోవడానికి కరీనా వద్ద డబ్బుల్లేవా’ అంటూ సూటిగా ప్రశ్నించారు. కరీనా కపూర్ ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయలు తీసుకుంటోందని… కనీసం ఇంటి బయట వాచ్ మెన్ ను పెట్టుకోలేకపోతున్నారా అంటూ వారు కరీనాను ప్రశ్నించారు. అలాగే సైఫ్ పై దాడి జరిగినప్పుడు అక్కడ కారు డ్రైవర్లు ఎవరూ లేరు. అందువలన అతను ఆటోలో ఆసుపత్రికి వెళ్ళవలసి వచ్చింది. ఒకవేళ వాళ్లకు రూ.100 కోట్లు రెమ్యునరేషన్‌ ఇస్తే వాళ్లు సెక్యూరిటీని, డ్రైవర్‌ను పెట్టుకుంటారేమో’ అని సెటెరికల్ కామెంట్స్ చేశారు ఆకాశ్ దీప్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆరాధ్యపై ఫేక్ న్యూస్.. ఐశ్వర్య సీరియస్‌ యాక్షన్‌

మళ్లీ ఐటీ కార్యాలయానికి దిల్ రాజు.. ఈసారి బ్యాంక్‌ స్టేట్‌మెంట్లతో..

భర్త చేతుల మీదుగా.. అందాల రాక్షసి నయా సినిమా…