రిలీజ్ అయిన 20 రోజుల్లోనే OTTకి వచ్చిన నిఖిల్ కొత్త సినిమా
‘స్వామి రారా’, ‘కేశవ’ సినిమాలతో సూపర్ హిట్ కాంబోగా పేరు తెచ్చుకున్నారు నిఖిల్- సుధీర్ వర్మ. ఇప్పుడు వీరి కలయికలోనే వచ్చిన చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. సప్త సాగరాలు దాటి సినిమాతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు దక్కించుకున్న రుక్మిణి వసంత్ ఈ సినిమాలో కథానాయికగా నటించింది. కరోనా కాలంలో పట్టాలెక్కిన ఈ మూవీ ఎన్నో అవాంతరాలు దాటి.. కనీసం ప్రమోషన్స్ కూడా లేకుండానే.. నవంబర్ 08న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆడియన్స్ను మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడేమో…ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా లేకుండా… సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇక నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 27 అర్ధరాత్రి నుంచే నిఖిల్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. నిఖిల్-రుక్మిణీల జోడీకి మంచి పేరొచ్చినప్పటికీ ఆకట్టుకునే కథ, కథనాలు సినిమాలో లేకపోవడంతో ఆడియన్స్ పెదవి విరిచారు. ఫలితంగా స్పై సినిమా తర్వాత నిఖిల్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరింది. థియేటర్లలో ఆడియన్స్ ను నిరాశపర్చిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా ఇప్పుడు సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Top 9 ET News: పుష్ప2కు రూ.300 కోట్ల రెమ్యూనరేషన్ మనోడే టాప్
Priyanka Jain: తిరుమలలో ప్రియాంక ప్రాంక్ వీడియో !! హెచ్చరించిన భక్తులు
Subbaraju: 47ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న సుబ్బరాజ్
చైతూ, శోభిత పెళ్లి డిజిటల్ రైట్స్ పై ప్రచారం క్లారిటీ ఇచ్చిన నాగ్ టీం
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

