Shruti Marathe: బిగ్ అప్డేట్.! రెండో ఎన్టీఆర్‌కు హీరోయిన్‌గా మరాఠా బ్యూటీ శృతి..

ఇప్పుడు యంగ్ టైగర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సినిమా ‘దేవర’.. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‏గా వస్తున్న ఈ మూవీలో తారక్ ఊర మాస్ అవతారంలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ చూస్తుంటే.. ఈసారి ఎన్టీఆర్‏ను ఓ రేంజ్ లో చూపించేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. జనతా గ్యారేజ్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న ఈ మూవీ కావడంతో దేవరను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

Shruti Marathe: బిగ్ అప్డేట్.! రెండో ఎన్టీఆర్‌కు హీరోయిన్‌గా మరాఠా బ్యూటీ శృతి..

|

Updated on: Feb 11, 2024 | 4:04 PM

ఇప్పుడు యంగ్ టైగర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సినిమా ‘దేవర’.. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‏గా వస్తున్న ఈ మూవీలో తారక్ ఊర మాస్ అవతారంలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ చూస్తుంటే.. ఈసారి ఎన్టీఆర్‏ను ఓ రేంజ్ లో చూపించేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. జనతా గ్యారేజ్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న ఈ మూవీ కావడంతో దేవరను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈసారి వీరిద్దరి కాంబోలో ఎలాంటి మ్యాజిక్ జరగనుందనే క్యూరియాసిటి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. రోజు రోజుకీ ఈ మూవీపై విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీతోనే తెలుగు అడియన్స్ ముందుకు రాబోతుంది జాన్వీ. అలాగే ఈ సినిమాలో తారక్‏ను ఢీకొట్టే ప్రతినాయకుడిగా స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. వీరిద్దరు కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇదే. ఇదిలా ఉంటే… తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వైరల్ అవుతోంది.

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన మరో హీరోయిన్ కనిపించనుందట. దేవర సినిమాతోనే ఈ బ్యూటీ తెలుగు తెరకు పరిచయం కాబోతుందట. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా ?.. మరాఠీ చిత్ర పరిశ్రమకు చెందిన నటి శృతి మరాఠేని మేకర్స్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కొరటాల తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ డ్రామాలో తారక్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని.. ఇందులో ఓ పాత్ర జోడిగా శృతి కనిపించనుందని టాక్. ఈ విషయం గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే.. బాలీవుడ్, మరాఠీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఇద్దరూ తారక్ సరసన కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

ఈ మూవీని ఈ ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. కానీ కొన్ని రోజులుగా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ మూవీ రిలీజ్ వాయిదా పడిందని.. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ఫస్ట్ పార్ట్ షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రాన్ని భారీ మొత్తంలో పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ కొత్త సినిమా చేయనున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us