Krishnam Raju Death: ఏడ్చి ఏడ్చి కూలబడిపోయిన కృష్ణంరాజు భార్య..
కృష్ణంరాజు(Krishnam Raju)మరణంతో టాలీవుడ్ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణం రాజు చికిత్స పొందుతూ కన్నుమూశారు. 83 ఏళ్ల కృష్ణంరాజు మరణవార్త విని టాలీవుడ్ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైంది.
సినిమాల్లో రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉప్పలపాటి కృష్ణంరాజు రాజకీయాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. కేంద్రమంత్రిగా పనిచేసి రాజకీయనేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున తొలిసారి ఏంపీగా గెలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. బీజేపీలో చేరిన తర్వాత రాజకీయాల్లో కృష్ణంరాజుకు అదృష్టం కలిసొచ్చింది. 1998లో కాకినాడ లోక్ సభ స్థానం నుంచి పోటీచేసి సమీప అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన తోట గోపాలకృష్ణపై 67,799 ఓట్ల భారీ అధిక్యంతో గెలుపొందారు. ఆఎన్నికల్లో కృష్ణం రాజుకు 3,30,381 ఓట్లు రాగా.. సమీప అభ్యర్థి తోట గోపాలకృష్ణకు 262,582 ఓట్లు వచ్చాయి. పొత్తు లేకుండా ఒంటరిగా పోటీచేసి బీజేపీ తరపున కృష్ణంరాజు గెలిచి ఓరికార్డు సృష్టించారు. కాకినాడ ఏంపీగా ఏడాది మాత్రమే ఆయన పనిచేశారు. ఇక 1999 ఎన్నికల్లో నరసాపురం నుంచి ఏంపీగా పోటీచేసి విజయం సాధించారు. ఆఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై 1,65,948 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి రికార్డు సృష్టించారు. సొంత జిల్లా కావడంతో కృష్ణం రాజు భారీ మెజార్టీ సాధించారు. ఇక రెండో సారి ఏంపీగా గెలవడంతో బీజేపీ అధినాయకత్వం ఆయనను కేంద్రమంత్రి పదవితో గౌరవించింది. 2000 నుంచి 2004 వరకు ఆయన కేంద్ర మంత్రిగా సేవలందించారు. అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

