AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: విజయ్‌ దేవరకొండ సినిమాను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన రష్మిక.!

Rashmika Mandanna: విజయ్‌ దేవరకొండ సినిమాను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన రష్మిక.!

Anil kumar poka
|

Updated on: Jul 28, 2024 | 3:03 PM

Share

ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో ఫుల్ బిజీ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. విభిన్నమైన కథా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది రష్మిక. అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా తర్వాత రష్మిక క్రేజ్ మారిపోయింది. తెలుగుతోపాటు అటు హిందీలోనూ వరుస ఆఫర్స్ అందుకుంటూ అగ్రకథానాయికగా కొనసాగుతోంది. ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటోంది.

ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో ఫుల్ బిజీ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. విభిన్నమైన కథా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది రష్మిక. అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా తర్వాత రష్మిక క్రేజ్ మారిపోయింది. తెలుగుతోపాటు అటు హిందీలోనూ వరుస ఆఫర్స్ అందుకుంటూ అగ్రకథానాయికగా కొనసాగుతోంది. ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఈ కమ్రంలోనే తాజాగా తాను నటించిన ఓ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది రష్మిక. ఆ సినిమా విడుదలై నేటికి ఐదేళ్లు పూర్తైన ప్రేక్షకులు ఇప్పటికీ తనను లిల్లీగానే గుర్తుపెట్టుకున్నారని.. ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన పాత్రను అంతగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. ఇంతకీ ఆ సినిమా ఏంటీ అనుకుంటున్నారా..? అదే డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన సినిమా డియర్ కామ్రేడ్.

2019లో విడుదలైన ఈ సినిమా మంచి రివ్యూస్ అందుకుంది. కానీ కమర్షియల్ హిట్ కాలేకపోయింది. గీతా గోవిందం తర్వాత వీరిద్దరు కలిసి నటించిన సినిమా ఇదే. ఇందులో రష్మిక లిల్లీ పాత్రలో కనిపించి అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా విడుదలై నేటికి ఐదేళ్లు.. ఈ సందర్బంగా తన ఇన్ స్టాలో డియర్ కామ్రేడ్ సినిమా గురించి ఆసక్తికర పోస్ట్ చేసింది రష్మిక. “డియర్ కామ్రేడ్ సినిమాను అభిమానించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటికీ దీనిని ఆదరిస్తున్నందుకు సంతోషిస్తున్నాను. స్క్రిప్ట్ నెరేషన్ తో మొదలైన ఈ ప్రయాణంలో నెలలపాటు క్రికెట్ ట్రైనింగ్, గాయాలు, నవ్వులతో సాగిన షూట్.. చిత్రీకరణ పూర్తైన రోజు భావోద్వేగ క్షణాలున్నాయి. ఈ సినిమా తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకులు నన్ను లిల్లీగానే గుర్తుపెట్టుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి క్షణం నాకెంతో ప్రత్యేకం. భరత్, విజయ్ దేవరకొండతోపాటు చిత్రయూనిట్ కు ధన్యవాదాలు” అంటూ సుధీర్ఘ నోట్ రాసుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.