AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైఫ్ అలీఖాన్ ఆస్తులు తెలిస్తే షాకవుతారు..!

సైఫ్ అలీఖాన్ ఆస్తులు తెలిస్తే షాకవుతారు..!

Samatha J
|

Updated on: Jan 20, 2025 | 1:01 PM

Share

బీటౌన్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై గత అర్దరాత్రి ఓ దొంగ కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం సైఫ్.. లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు దాడి చేసిన వ్యక్తి ఎవరనేది తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సైఫ్ మీద జరిగిన దాడి ఘటనపై బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి ఈ ఘటనపై స్పందించగా.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ లీలావతి ఆసుపత్రికి చేరుకున్నట్లు సమాచారం.

ఈ ఘటన తర్వాత సైఫ్ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. సైఫ్ టీమిండియా మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి.. హిందీ నటి షర్మిలా టాగోర్ దంపతుల కుమారుడు. 1991లో హిందీ నటి అమృతా సింగ్ ను వివాహాం చేసుకున్నారు. వీరికి సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్ జన్మించారు. ఆ తర్వాత 2004లో వీరిద్దరు విడాకులు తీసుకోగా.. 2012లో హీరోయిన్ కరీనా కపూర్ ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. నివేదికల ప్రకారం సైఫ్ ఇప్పటివరకు రూ.1,180 కోట్లు సంపాదించారు. కాగా, సైఫ్ పూర్వీకులు పటౌడీ నవాబులు. వీరికి హర్యానాలో పటౌడీ ప్యాలెస్ ఉంది. 10 ఎకరాల్లో 150 గదులు, ఏడు పడక గదులు కలిగిన విశాలమైన ప్యాలస్‌ అది. దాని ధర రూ.800 కోట్లు. ముంబై, ఢిల్లీ, హర్యానా, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఉన్న రూ.5000 కోట్ ఆస్తులకు అధిపతి. దీంతో ఇప్పుడు ఆయన నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

సైఫ్ అలీఖాన్‌పై దుండగుడి దాడి.. కరీనా ఎలా తప్పించుకుందంటే?

భయాందోళనలో బాలీవుడ్‌.. అక్కడ అసలేంజరుగుతోంది! వీడియో

సైఫ్ అలీఖాన్‌పై దుండగుడి దాడి.. కరీనా ఎలా తప్పించుకుందంటే?

కాగితాల్ని కాల్చేస్తున్న నీళ్లు..ఏంటీ మిస్టరీ..?

Published on: Jan 20, 2025 09:25 AM