AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prithviraj: కమెడియన్ పృథ్వీ రాజ్‌ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ జారీ.!

Prithviraj: కమెడియన్ పృథ్వీ రాజ్‌ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ జారీ.!

Anil kumar poka
|

Updated on: Jun 14, 2024 | 10:19 AM

Share

పృథ్వీ రాజ్‌..! స్టార్ కమెడియన్‌గా టాలీవుడ్‌లో దూసుకుపోయే క్రమంలోనే.. కొన్ని పర్సనల్ వివాదాల్లో ఇరుకుని సినిమాలకు కాస్త దూరమయ్యాడు ఈయన. అడపాదడపా రాజకీయ కామెంట్స్‌తో అప్పుడప్పుడూ నెట్టింట వైరల్ కూడా అయ్యేవాడు. అలాంటి ఈ కమెడియన్ మరో సారి చిక్కుల్లో చిక్కున్నాడు. ఈ సారి ఏకంగా తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యే వరకు తెచ్చుకున్నాడు.

పృథ్వీ రాజ్‌..! స్టార్ కమెడియన్‌గా టాలీవుడ్‌లో దూసుకుపోయే క్రమంలోనే.. కొన్ని పర్సనల్ వివాదాల్లో ఇరుకుని సినిమాలకు కాస్త దూరమయ్యాడు ఈయన. అడపాదడపా రాజకీయ కామెంట్స్‌తో అప్పుడప్పుడూ నెట్టింట వైరల్ కూడా అయ్యేవాడు. అలాంటి ఈ కమెడియన్ మరో సారి చిక్కుల్లో చిక్కున్నాడు. ఈ సారి ఏకంగా తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యే వరకు తెచ్చుకున్నాడు. ఇక అసలు విషయం ఏంటంటే..! పృథ్వీరాజ్‌కు విజయవాడకు చెందిన శ్రీలక్ష్మితో 1984లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంతకాలం సజవుగా సాగిన వీరికాపురంలో మనస్పర్ధలు వచ్చాయి. దీంతో వీరిద్దరూ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. భార్య శ్రీలక్ష్మీ పిల్లలతో కలిసి తన పుట్టింట్లో ఉండసాగింది. భర్త నుంచి తనకు నెలకు 8 లక్షల భరణం ఇప్పించాలంటూ శ్రీలక్ష్మి 2017లో కోర్టును ఆశ్రయించింది. 2016 ఏప్రిల్‌ 5న ఇంట్లో నుంచి తనను వెళ్లగొట్టాడని, దీంతో అప్పటి నుంచి తన పుట్టింటిలోనే ఉంటున్నట్లు ఫిర్యాదులో ఆమె పేర్కొంది. సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా నెలకు 30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు అందులో తెలిపింది. భర్త నుంచి తనకు నెలకు 8 లక్షల భరణం ఇప్పించాలని కోర్టును కోరింది.

దీనిని 2017 జనవరి 10న విచారించిన కోర్టు.. పృథ్వీరాజ్‌ తన భార్యకు నెలకు రూ.8 లక్షల భరణంతోపాటు.. కేసు దాఖలు చేసినప్పటి నుంచి అయిన ఖర్చులు కూడా ఆయనే ఇవ్వాలని తీర్పునిచ్చింది. ప్రతి నెలా 10వ తేదీ నాటికి భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించడంతో పృథ్విరాజ్‌ హైకోర్టులో దీనిని సవాలు చేశాడు. కేసు వివరాలను పరిశీలించిన హైకోర్టు నెలకు రూ.22 వేలు చెల్లించాలని, అప్పటి వరకు ఉన్న బకాయిలు మొత్తం చెల్లించాలని ఆదేశించింది. అయితే శ్రీలక్ష్మీకి భరణం చెల్లించడంతో పృథ్వీరాజ్ హైకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయలేదు. పైగా కోర్టుకు కూడా హాజరుకావడం లేదని వార్తలు వస్తున్నాయి. దీంతో మరోమారు భార్య శ్రీలక్ష్మి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ వేయడంతో.. విజయవాడ ఫ్యామిలీ కోర్టు పృథ్వీరాజ్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో పృథ్వీరాజ్ పీకల్లోతు చిక్కుల్లో ఇరుక్కుపోయినట్లైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.