Adah Sharma: సుశాంత్ ఉరేసుకున్న ఇంటికి షిఫ్ట్ అయిన అదా శర్మ

Adah Sharma: సుశాంత్ ఉరేసుకున్న ఇంటికి షిఫ్ట్ అయిన అదా శర్మ

|

Updated on: Oct 19, 2024 | 1:20 PM

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఇంటిని నటి అదాశర్మ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఇంటిని రీమోడలింగ్‌ చేసిన అదా.. ఇటీవలే కుటుంబంతో సహా అక్కడికి షిఫ్ట్‌ అయ్యారు. అయితే.. ఆమె పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నారని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా వీటిపై అదా స్పందించారు. ఒక నటిగా తనకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని ఇలాంటివాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

అలాగే ఆ ఇంటిని ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. అభిప్రాయాలు తెలపడానికి మన దేశంలో పూర్తి హక్కు ఉంటుందనీ తాను ఆ ఇంటిని కొనుగోలు చేయడంపై ఎవరి అభిప్రాయాలు వాళ్లు తెలిపారనీ తనకు చేయాలనిపించింది తాను చేశాననీ అదా శర్మ కామెంట్‌ చేసింది. సుశాంత్‌ ఇల్లు ఎంతో నచ్చిందనీ తన అమ్మ, అమ్మమ్మతో కలిసి ఇక్కడ ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఇంట్లో ఏదో తెలియని శక్తి ఉందని చెప్పింది. గతంలో కూడా ఈ ఇంటిపై అదా ఇలాంటి కామెంట్సే చేసింది. సుశాంత్‌ ఇంటిని చూడగానే తనకు ఎంతో పాజిటివ్‌గా అనిపించిందని అందుకే కొన్నట్లు తెలిపింది. మొత్తం రీమోడలింగ్ చేసి మొదటి అంతస్తుని గుడిలా మార్చేసినట్లు చెప్పింది. ఒక గదిని మ్యూజిక్‌ రూమ్‌గా, మరో దాన్ని డ్యాన్స్‌ స్టూడియోగా చేసిందట. టెర్రస్‌ మొత్తం గార్డెన్‌లా మార్చేసినట్లు తెలిపింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. ఏంటా ఆవేశం.. కారును తుక్కు తుక్కు చేసిన ఏనుగు.. చివరకు ??

TOP 9 ET News: ఒక్క సాంగ్‌ కోసం రూ.20 కోట్లు !! | సంచలనం !! అప్పుడే రూ.900 కోట్ల బిజినెస్‌

డెంగ్యూ వస్తే మేక పాలు తాగాలా ??

తులం బంగారం రూ.లక్ష ?? పుత్తడి జోరుకు బ్రేకులు పడే ఛాన్స్ లేదా ??

Follow us