రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే రూ.10 లక్షలు.. పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్
మీ డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా సురక్షితమైన, మంచి రాబడిని పొందాలనుకుంటున్నారా? పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్ అందుబాటులోకి తెచ్చింది కేంద్రప్రభుత్వం. అదే కిసాన్ వికాస్ పత్ర . పోస్టాఫీసు నిర్వహించే ఈ ప్రభుత్వ పథకం పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, పెట్టుబడిపై భద్రతకు హామీ ఇస్తుంది. దేశంలోని ప్రధాన బ్యాంకుల మాదిరిగానే పోస్టాఫీసు కూడా తన కస్టమర్లకు వివిధ రకాల పొదుపు పథకాలను అందిస్తుంది.
కిసాన్ వికాస్ పత్ర యోజన ముఖ్యంగా అధిక రాబడి, సురక్షితమైన పెట్టుబడికి ప్రసిద్ధి చెందింది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీని పొందవచ్చు. అంతేకాకుండా మీ డబ్బును సురక్షితంగా ఉంచుకోవచ్చు. కిసాన్ వికాస్ పత్ర పథకం ప్రస్తుతం 7.5 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. ఈ పథకంలో ఒకేసారి ఒక పెద్ద మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. కనీసం రూ. 1000 తో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. అలాగే గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. ఈ పథకంలో పెట్టుబడి పెడితే మీ డబ్బు మెచ్యూరిటీ సమయంలో రెట్టింపు అవుతుంది. కిసాన్ వికాస్ పత్ర యోజనలో మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు 115 నెలల్లో అంటే 9 సంవత్సరాల 7 నెలల్లో రెట్టింపు అవుతుంది. మీరు ఈ పథకంలో రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే, మీకు 7.5% వడ్డీ రేటుతో రూ.5 లక్షల వడ్డీ లభిస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీళ్ల కరెంట్ బిల్తో.. విల్లా కొనేయొచ్చు !! షాకిస్తున్న హీరోల కరెంట్ బిల్
మరో గుడ్ న్యూస్ చెప్పనున్న అక్కినేని ఫ్యామిలీ..
Monalisa: మోనాలిసా గొప్ప మనసుకు జనం ఫిదా..
ప్రతిరోజూ పెరుగు తీసుకుంటే జరిగేది ఇదే
బంగారం చిన్న దుకాణంలో మంచిదా.. పెద్ద షోరూమ్లో బెటరా..?
అయ్యో.. ఈ శునకం కష్టాలు చూసి చలించిపోయిన భక్తులు
చీకటిపడ్డాక చెరువు గట్టుపై వణుకు పుట్టించే సీన్..
అమ్మంటే అమ్మే.. తన బిడ్డ కోసం ఉడుతమ్మ సాహసానికి నెటిజన్లు ఫిదా
భర్త ఎదుటే ఉరివేసుకున్న భార్య.. కాపాడాల్సింది పోయి..
ఇడ్లీ తింటే .. జీఎస్టీతో పాటు 'గ్యాస్ ఫీజు' కట్టాల్సిందే..
అమ్మ దొంగ చేపా... ఎంత పనిచేశావే !
గ్రామస్తులపై తేనెటీగల దాడి..15 మంది..

