Budget 2024: బడ్జెట్‌లో కేంద్రం గుడ్‌న్యూస్‌.. రైతుల ఆదాయం రెట్టింపు

పాడి ఉత్ప్తతులను, ఎగుమతులను ప్రోత్సహిస్తుంది. ప్రపంచంలోనే అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసేది మన దేశమే. ప్రపంచం మొత్తం పాలలో 24.64 శాతాన్ని మన దేశమే ప్రొడ్యూస్ చేస్తోంది. అంటే నాలుగింట ఒక వంతు మన దగ్గరే రెడీ అవుతోంది. ఇది 2021-2022 నాటి లెక్క. ఇక 2014-15 నుంచి 2022-23 మధ్య.. అంటే 9 ఏళ్ల కాలంలో దేశంలో పాల ఉత్పత్తి 58 శాతం పెరిగింది. మరి రైతుల..

Budget 2024: బడ్జెట్‌లో కేంద్రం గుడ్‌న్యూస్‌.. రైతుల ఆదాయం రెట్టింపు

|

Updated on: Feb 02, 2024 | 3:02 PM

మధ్యంతర బడ్జెట్‌లో పాడి రైతులకు కొన్ని శుభవార్తలు ఉన్నాయి. పాడి అభివృద్ధి కోసం రైతులకు ఆర్థిక సాయం చేస్తామంది కేంద్రం. రాష్ట్రీయ డెయిరీ ప్రాసెసింగ్‌ గోకుల మిషన్‌ ద్వారా ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తామని చెప్పింది. ఇది పాడి ఉత్ప్తతులను, ఎగుమతులను ప్రోత్సహిస్తుంది. ప్రపంచంలోనే అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసేది మన దేశమే. ప్రపంచం మొత్తం పాలలో 24.64 శాతాన్ని మన దేశమే ప్రొడ్యూస్ చేస్తోంది. అంటే నాలుగింట ఒక వంతు మన దగ్గరే రెడీ అవుతోంది. ఇది 2021-2022 నాటి లెక్క. ఇక 2014-15 నుంచి 2022-23 మధ్య.. అంటే 9 ఏళ్ల కాలంలో దేశంలో పాల ఉత్పత్తి 58 శాతం పెరిగింది. మరి రైతుల ఆదాయం ఎలా రెట్టింపు చేయవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..

Follow us
Latest Articles