Yadadri: తెల్లారేసరికి కాలేజీ ఆవరణలో భయంకర సీన్.. అమ్మాయిలు చూడగా.. వామ్మో.!
కాలేజీ ప్రధాన ద్వారం గుండె లోపలికి వస్తున్న దారిలో క్షుద్ర పూజలు ఆనవాళ్లు కనిపించాయి. ఈ క్షుద్ర పూజలకు ఉపయోగించే పసుపు, కుంకుమ, మిరపకాయలు, కోడి తలలు కనిపించడంతో..
సృష్టికి ప్రతి సృష్టి జరుగుతున్న నేటి ఆధునిక యుగంలో కూడా ఇంకా క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. యాదాద్రి జిల్లా మోత్కూరులోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఆవరణలో క్షుద్ర పూజల ఆనవాళ్లు అలజడి రేపాయి. కాలేజీ ప్రధాన గేటు వద్ద నిమ్మకాయలు, కోడి తలలు, పసుపు, కుంకుమ, మిరపకాయలు తదితర క్షుద్ర పూజలకు ఉపయోగించే వస్తువులతో క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించాయి. ఈ ప్రభుత్వ జూనియర్ కాలేజీకి పరిసర గ్రామాల నుంచి 400 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ కోసం వస్తుంటారు. కాలేజీ ప్రధాన ద్వారం గుండె లోపలికి వస్తున్న దారిలో క్షుద్ర పూజలు ఆనవాళ్లు కనిపించాయి. ఈ క్షుద్ర పూజలకు ఉపయోగించే పసుపు, కుంకుమ, మిరపకాయలు, కోడి తలలు కనిపించడంతో విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు ఆందోళన చెందారు. కాలేజీకి నైట్ వాచ్మెన్ లేకపోవడం, కాలేజీ చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో కాలేజ్ ఆవరణలో అసాంఘిక కార్యకలాపాలు క్షుద్ర పూజలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. క్షుద్ర పూజల దృశ్యాలను చూసి కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. వీటిని పరిశీలించిన స్థానిక పోలీసులు.. ఆకతాయిలు చేసిన పనిగా పేర్కొన్నారు.
ఇది చదవండి:
చేపల కోసం వేటకు వెళ్తే.. గాలానికి చిక్కింది చూసి గుండె గుభేల్
గోరుముద్ద నుంచే బ్యాక్టీరియా.! ఆ తర్వాత క్యాన్సర్గా..!!
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో
ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్ఫోన్ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు
ముస్లిం సోదరుల కోసం హిందూ కుటుంబం ఉదారత
దారుణం.. 2 నెలల పసికందును పొయ్యిలో పడేసి..
కత్తితో కారు దిగిన మహిళ.. కారు పైకి కోడిగుడ్లు విసిరిన దుండగులు

