Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయోధ్యలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ విశేషాలివే

అయోధ్యలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ విశేషాలివే

Phani CH

|

Updated on: Jan 01, 2024 | 3:08 PM

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయోధ్యకు వచ్చే భక్తుల కోసం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, మరిన్ని సౌకర్యాలతో రైల్వే స్టేషన్‌ను పునరుద్ధరించిన విషయం తెలిసిందే. ఈ రెండింటిని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్నారు. అధికారులు నగరంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. డాగ్‌ స్క్వాడ్‌, బాంబ్‌ స్క్వాడ్‌తో నగంలో అణువణువునా గాలిస్తున్నారు.

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయోధ్యకు వచ్చే భక్తుల కోసం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, మరిన్ని సౌకర్యాలతో రైల్వే స్టేషన్‌ను పునరుద్ధరించిన విషయం తెలిసిందే. ఈ రెండింటిని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్నారు. అధికారులు నగరంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. డాగ్‌ స్క్వాడ్‌, బాంబ్‌ స్క్వాడ్‌తో నగంలో అణువణువునా గాలిస్తున్నారు. అదే విధంగా నగరంలో భద్రతా ఏర్పాట్లను, నిషేధిత ప్రాంతాలను అయోధ్య పోలీసులు డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఇక రూ.1450 కోట్లతో నిర్మించిన ఎయిర్‌పోర్టుకు 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్‌ భవనాన్ని నిర్మించారు. 600 మంది ప్రయాణికులకు అనువుగా ఏర్పాట్లు చేశారు. ఈ విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ అయోధ్యధామం’ అని పేరుపెట్టారు. ఇంతకుముందు ఈ విమానాశ్రయాన్ని ‘మర్యాద పురుషోత్తమ్‌ శ్రీరామ్‌ అయోధ్య అంతర్జాతీయ విమనాశ్రాయం’గా పిలిచారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నదినే రన్‌వేగా పొరబడ్డ పైలట్‌.. దానిపైనే విమానం ల్యాండింగ్

అయోధ్యకు 620 కిలోల గంట.. దానిపై జై శ్రీరామ్ అని రాసి ఉండటం దీని ప్రత్యేకత

భారీ సంఖ్యలో నిఘా ఉపగ్రహాలు బలోపేతం చేయనున్న భారత్..

అదిలాబాద్‌నుంచి అయోధ్యకు అక్షింతలు.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు